ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జులై 25, 2023

ఆంధ్రా రాజకీయాలు ఇంతిలా నాశనం కావడం ఇదే తొలిసారి!

ఆంధ్రా రాజకీయాలు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ప్రజలను సక్రమార్గంలో నడిపించాల్సిన మంత్రులు, MLAs పచ్చి బూతులు మాట్లాడుతుంటే... ప్రక్కనే ఉన్న ముఖ్యమంత్రిగారు చిరునవ్వులు నవ్వుతుంటే... ఇక ప్రజల పరిస్థితి ఏమిటి?

అబద్ధాలు, అసహ్యకరమైన బూతులు... ఇదేమి రాజకీయం!

న్యూస్ చానెళ్ళు చూడాలంటే భయమేస్తుంది.. ఎక్కడ పిల్లలు ఆ బూతులు వింటారేమోనని!

ఆంధ్రాలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? 

ఉచిత పధకాల కోసం విపరీతంగా నిత్యావసరాల ధరలు పెంచేసారు. 

పూర్వం ఒకరాజ్యంలో రాజుగారు ప్రజలందరూ మనకి బానిసలుగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? అని మంత్రివర్గంలో అడిగినప్పుడు మంత్రులందరూ ప్రజలలో స్వయం ఉపాధి లేకుండా చేసి మనం పడేసే డానికి అలవాటు చేస్తే చాలని సెలవిచ్చారట!

నేటి పాలన అలాగే ఉంది

శనివారం, జులై 08, 2023

 

సరదాగానే తెలుగు బ్లాగులను చూద్దామని నెట్లో వెతుకుతూ ఉంటే మన "మాలిక" కనిపించింది. తెలుగు బ్లాగులు అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాం. అయినా కొంతమంది మా పాత బ్లాగు మిత్రులు శ్యామలీయం గారు, sarma గారు, Zilebi గారు, MANOHAR CHIMMANIగారు, విన్నకోట నరసింహా రావు గారు, bonagiriగారు... ఇలా అనేకులు ఇంకా బ్లాగు పోస్టులు వ్రాయడం, కామెంట్లు వ్రాయడం చాలా సంతోషంగానే ఉంది.

   ఏది , ఏమైనా తెలుగును బ్రతికించడంలో మన తెలుగు బ్లాగర్ల పాత్ర కూడా ఉంది.

ఇంతకుముందు ఉండే బ్లాగర్ల మధ్య కామెంట్ల యుద్ధాలు ఇప్పుడు పెద్దగా లేవనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళి నాకు బ్లాగు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని బ్లాగు పోస్టులను వ్రాయాలని అనిపిస్తోంది.

నాతోటి బ్లాగు మిత్రులందరికీ నమస్కారాలతో... మీ బ్లాగు మిత్రుడు KS చౌదరి

ఆదివారం, మార్చి 26, 2023

మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం ఉంది, వెనకాల రాబందు ఉంది, ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని... 

ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని, తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది. ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి, సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి.... 

ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... ఏమో సార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... 

ఆ రోజు అక్కడ ఉన్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు...   

ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత... అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే..... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది ఉన్నారు‌. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం ఉన్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ.... ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే. కాబట్టి మీలో ఉన్న కెవిన్ ని చంపండి...

గమనిక: బ్లాగు మిత్రులందరికీ ముఖ్యమైన విషయమేమిటంటే... పై పోస్టు నా స్వంతమైనది కాదు. ఒక మిత్రుడు నాకు వాట్సాప్ లో పంపితే బాగుందని చెప్పి మీకోసం పబ్లిష్ చేసాను.

బుధవారం, ఆగస్టు 31, 2022

Happy Ganesh Chaturthi | బ్లాగు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

Happy Ganesh Chaturthi
Happy Ganesh Chaturthi

*సామాన్య వినాయకుడు - సంకేత వినాయకుడు* 

మానసిక శారీరక శక్తి యుక్తుల సామర్థ్యాల పరంగా జ్ఞానం వివేచనల పరంగా, వ్యక్తులు వివిధ స్థాయిలలో ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. వారిని మౌలికంగ రెండు విధాలుగా వర్గీకరించవచ్చు.

 *1) మూర్త ప్రజ్ఞులు (సామాన్య దృష్టి పరులు):* 

వీరు ఏదైన ఒక విషయాన్ని ప్రత్యక్షంగా చూచినపుడు తాను చూస్తున్న విషయాన్ని మాత్రమే గుర్తించగలరు. కాని ఆ ప్రత్యక్షం ద్వారా తెలుపబడుతున్న పరోక్షాన్ని గుర్తించలేరు.

 *2)అమూర్త ప్రజ్ఞులు (సంకేత దృష్టి పరులు):* 

వీరు ఏదైనా ఒక విషయాన్ని చూచినపుడు తాము ప్రత్యక్షంగా చూస్తున్న విషయాన్ని మాత్రమే కాక ఆ ప్రత్యక్షం ద్వారా తెలుపబడుతున్న పరోక్షాన్ని సైతం గుర్తించగలరు.

ఉదాహరణకు మేడ మెట్లు ఎక్కడం కష్టం, దిగడం సులభం ఎందుచేత అని ప్రశ్నిస్తే మూర్త ప్రజ్ఞులు ఇచ్చే సమాధానం- మెట్లు ఎక్కడం శ్రమతో కూడుకున్న పని కాబట్టి కష్టం, దిగడం శ్రమరహితం కాబట్టి సులభం అన్నది! మరి ఇదే ప్రశ్నకు అమూర్త ప్రజ్ఞులు ఇచ్చే సమాధానమేమిటంటే- మెట్లు ఎక్కడం కష్టంగా ఉంది, దిగడం సులువుగా ఉంది అనే ప్రత్యక్ష విషయాన్ని ప్రమాణంగా చేసుకొని భూమికి ' *గురుత్వాకర్షణ శక్తి' (GRAVITATIONAL FORCE)* ఉందనే పరోక్ష విషయాన్ని సైతం గుర్తించగలరు. మూర్త, అమూర్త ప్రజ్ఞులకు గల ఈ తేడాను మరొక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. తాజ్ మహల్ లాంటి అద్భుత కళాఖండాన్ని చూసి మూర్త ప్రజ్ఞులు ( *సామాన్య దృష్టి పరులు* ) ఆ 'కళాఖండపు గొప్పతనాన్ని మాత్రమే గుర్తించి, దానినే కీర్తిస్తారు'. కాని అమూర్త ప్రజ్ఞులు ( *సంకేత దృష్టి పరులు* ) ఆ కళాఖండాన్ని చూసి 'దాని ఆ కళాత్మకతకు కారకుడైన దాని కళాకారుని కళాచాతుర్యాన్ని కొనియాడి వానిని కీర్తిస్తారు. అంటే- వీరు తమకు తారస పడిన దాని పైపై జ్ఞానాన్ని మాత్రమే కాక దాని మూలజ్ఞానాన్ని సైతం గ్రహిస్తారన్నమాట. *అలా చూడటాన్నే  సామాన్య దృష్టి మరియు సాంకేతిక దృష్టి అంటారు.*

*హిందూమతంలో విగ్రహాల నిర్మాణ మౌలిక ఉద్దేశం ఏమిటి?* 

విగ్రహం అనే పదానికి అమర కోసం అనే నిఘంటువిస్తున్న నిర్వచనం- *విశేషేణ గ్రహణం విగ్రహ:*  *విశేషంగా గ్రహించేది విగ్రహం* అంటే విగ్రహ నిర్మాణ మౌలిక ఉద్దేశం వాటి నుండి మనం సమాచారాన్ని గ్రహించడం అన్నమాట.

🔎 *వినాయకుని విగ్రహం - విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం*🔍

🔹ఏనుగు తల, ఏక దంతం, భారీ బొజ్జ వంటి వాటితో కూడిన వినాయకుని విగ్రహం హిందూ విగ్రహాలు అన్నింటికంటే ఎక్కువ విమర్శలకు గురవుతుంది. 

❤️ వాస్తవానికి వినాయకుని విగ్రహం అవ్యక్తుడైన దైవంపై విశ్వాసానికి, మానవతా విలువలకు సంకేతం. సాధారణ వాడుక భాషలో తెలివైనవాళ్లు ఉద్దేశించి వారిది పెద్ద తల అని అనటం వింటుంటాం. 

⏩అవ్యక్తుడైన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే విషయం తెలుపటానికే వినాయకుని విగ్రహానికి భారీ తల పెట్టడం జరిగింది. అంటే వినాయకుని భారీ తల జ్ఞానానికి ప్రతీకన్నమాట.

🧏‍♂️ అదేవిధంగా మనిషి ప్రతిభను మెరుగుపరిచే అంశాలలో విషయాన్ని సావధానంగా వినటం అనేది ఒకటి. సావధాన చిత్తులను చెవులు చేటలుగా చేసుకుని వింటున్నాడని అంటుంటాం. ఇతరులు చెబుతున్న విషయం పట్ల సావధాన చిత్తులై ఉండాలని చెప్పడానికి వినాయకుని చెవులు అంత పెద్దవిగా చిత్రీకరించారు మన పూర్వీకులు. 

👃అలానే ముక్కుసూటిగా మాట్లాడటం అనేది నైతిక విలువలలో అత్యంత ప్రధానమైనది. మనసులో సకల చెడు భావనలు కలిగి ఉండి పైకి మాత్రం చాలా గొప్ప భావనలు కలవారిగా నటించటం ఎంతో హేయమైన విషయం. ఇలాంటి రుగ్మతకు దూరంగా ఉండమని తెలియచేయటానికే వినాయకుని ముక్కుని తొండంగా పెట్టారు మన పూర్వీకులు. 

☝️సృష్టికర్త అయిన దైవం ఒక్కడు అనే సందేశాన్ని భద్రపరచటానికే వినాయకుని విగ్రహానికి ఒకే దంతం పెట్టడం జరిగింది.

🗣️ ఒకరిలోని లోపాలను మరొకరి ముందు చెప్పటం అనేది అత్యంత ఘోరమైన అవలక్షణం. దీని కారణంగానే వ్యక్తుల మధ్య మనస్పర్ధలు, కొట్లాటలు జరుగుతుంటాయి. 

ఇతరుల లోపాలు బహిర్గతం చేసే అవలక్షణాలను కడుపు నొప్పి, పొట్ట పేలి పోవడం లాంటి తదితర మాటలతో పోల్చటం చూస్తుంటాం. ఇతరుల రహస్యాలను గుప్తంగా ఉంచటం అనేది నైతిక విలువలకు పరాకాష్ఠ. ఇతరుల తప్పులను కడుపులో దాచుకోమని చెప్పడానికే వినాయకుని విగ్రహానికి భారీ బొజ్జ (పొట్ట) ను పెట్టడం జరిగింది.

⏭️అంతేకాక వినాయకుని చూసి చంద్రుడు అవహేళనచేస్తూ నవ్వాడని అందుకే వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదనే ప్రచారం వింటుంటాం. ఈ విషయం చూసి కొందరు- చంద్రుడు ఒక గ్రహం కదా!? గ్రహం నవ్వటం ఏమిటి? అని ప్రశ్నించటం మనకు విదితమే. వాస్తవానికి ఈ సంఘటన ద్వారా మన పూర్వీకులు ఎంత మనోహరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారో చూడండి.     

🔹ఇతరుల బాహ్యాన్ని చూసి అవహేళన చేసేవారిని సమాజం నుండి దూరంగా ఉంచాలని, వారితో మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదనే సమాచారాన్ని తెలియజేయటానికే ఆ కథను కల్పించటం జరిగిందే తప్ప నిజంగానే చంద్రుడు వినాయకుని చూసి నవ్వాడని కాదు ఇతరులలోని బాహ్యాన్ని చూసి హేళనచేయటం కాదు అంతర్గతంగా ఉన్న విశిష్టతలను గుర్తించటమే విజ్ఞత అన్న సమాచారం అందులో దాగి ఉంది.

❤️ఇలా అనేక ధార్మిక, నైతిక విలువలకు ప్రతీకగా వినాయకుని విగ్రహాన్ని సంకేత దృష్టితో గుర్తించటం విజ్ఞానం అవుతుంది. అలాకాక సామాన్య దృష్టితో ఆ వినాయకుని విగ్రహమే సాక్షాత్తు ఆ అవ్యక్త దేవుడని భావించి, దానినే వేడుకుంటే అది అజ్ఞానమవుతుంది.

ఉదాహరణకు నీరు (water) కు కేవలం సంకేతం మాత్రమే అయిన H2O ను సాక్షాత్తు నీరు(Water) అని అనుకోవటం ఎలా అయితే అజ్ఞానం అవుతుందో..!💡

➡️ వినాయకుని విగ్రహాన్ని సామాన్య దృష్టితో చూసే భక్తులు ఆ విగ్రహాన్ని ఆరాధించటం వలన కలిగే లాభాలేమిటి అనే ఆలోచనలో ఉంటారు ( *నిజానికి వైదిక ధర్మం విగ్రహారాధనను అనుమతించదన్నది వేరే విషయం*). కానీ ఆ వినాయక విగ్రహాన్ని సంకేత దృష్టితో చూసే భక్తులు దాని నిర్మాణం వెనుక ఉన్న మహత్తర ఉద్దేశాన్ని గ్రహించి తన వ్యక్తిత్వాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసుకుంటాడు. *నిజానికి పరమ పవిత్ర హిందూ మతానికి చెందిన విగ్రహాల వెనుక ఉన్న పరమోన్నత లక్ష్యం ఇదే*.

ఇలా వినాయకుని విగ్రహాన్ని సంకేత దృష్టితో చూసినప్పుడే మనలో విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం జరిగి తద్వారా భారత జాతికి పునర్ వైభవం దక్కుతుంది. 

 *సర్వేశ్వరుడు భారత దేశానికి విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతీ ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.*  

 *తథాస్తు! జైహింద్! జై శ్రీరామ్! భారత్ మాతాకి జై!* 

ganesh chaturthi, happy ganesh chaturthi, ganesh chaturthi 2022, happy ganesh chaturthi wishes, ganesh chaturthi date, ganesh chaturthi video, ganesh chaturthi katha, ganesh chaturthi wishes, ganesh chaturthi kab hai,ganesh, ganesh chaturthi puja vidhi, ganesh chaturthi status 2022, happy ganesh chaturthi song, ganesh chaturthi shubh muhurat, ganesh chaturthi kab hai 2022 august, happy ganesh chaturthi whatsapp status, ganesha,ganesh aarti, ganesh chaturthi ads

శనివారం, జనవరి 01, 2022

Happy New Year to esteemed blog friends
Happy New Year to esteemed blog friends

భయంకరమైన కరోనా వైరస్ సృష్టించిన అలజడి తరువాత  మొదటిసారిగా, నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా ఫ్యామిలీతో కలిపి చేసుకుంటున్నాం. ఓమిక్రాన్ భయంతో ఎవరూ భయట పెద్దగా తిరగనూ లేదు. ప్రభుత్వాలు కూడా కాస్త కటినంగానే వ్యవరించడం అభినందనీయం.  నిజానికి మనం నూతన్ సంవత్సర వేడుకలు జరుపుకోవడం అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి (పార్టీ!) గడియారం ముల్లు దాటి,దాటగానే, కేకు కంటిగ్లు చేయడం, పార్టీలు చేసుకోవడం కాదు.ఈ సంవత్సరం కంటే వచ్చే నూతన సంవత్సరంలో భవిష్యత్తు కోసం శక్తివంతమైన ఆశాజనకంగా ఉండడానికి సరైన ప్రణాళిక వేసుకోవడం. గడిచిపోయిన గత సంవత్సరం అవసరం లేదు. మన ముందున్న కొత్త సంవత్సరమే మనకవసరం. దానిని ఎంతవరకూ మరింత మెరుగ్గా తీసుకు వెళతామా అన్నదే ముఖ్యం.

కాబట్టి మనలో ప్రతి ఒక్కరమూ కొన్ని గోల్స్ వ్రాసుకుని మనం నిద్ర నుండి లేచినప్పుడు మొదటగా కనిపించేలా గోడకు వేలాడదీయండి. ప్రతి రోజూ మనం చూస్తూ ఉండటం వలన తప్పనిసరిగా వాటిని సాధించే అన్ని సాధనాలు మనకి సమకూరుతాయి.

మనకి అవసరం లేని పనికిమాలిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే కట్టెల పొయ్య కాలిపోయే కొద్దీ బూడిద మిగుల్చుకున్నట్టు, మన బుర్రలోకి పనికిమాలిన విషయాలు, అనవసరమైన విషయాలు ఎక్కించుకునే కొద్దీ నాశనాన్నే మిగులుస్తాయి.

మీకు అభిమానం ఉన్న హీరో సినిమా రిలీజ్ అయితే హుందాగా చూసి రావాలి. నచ్చిన నాయకుడు పోటీ చేస్తే అతని వలన ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మేలా,కీడా అని ఆలోచించి ఓటు వేసి మీ పనులు చూసుకోండి. అంతే గాని హీరో కోసం తలకు గుడ్డలు కట్టుకోవడం, రంగులు జల్లుకోవడం, కటౌట్ ల కోసం డబ్బులు వృధా చేసుకోవడం వికృత చర్యలు, రాజకీయ నాయకుల కోసం ప్రతి అడ్డమైన వివాదాలు సృష్టించటం, దూరటం, ప్రజాస్వామానికి ఆటoకాలు కలిగించడం ఇవి క్రూరత్వ చర్యలు. సమాజ మేలు కోసం పోరాడటం మహోన్నతం.. మంచి, చెడ్డా ఆలోచించకుండా అలజడులు సృష్టించడం మూర్ఖత్వం. ఇటువంటి చర్యలు కూడా చివరకి బూడిదనే మిగుస్తాయి.

తెర వెనుక డ్రామాగాల్లు ఉంటారు. తెర ముందు మంచివాల్లుంటారు, చెడ్డవాల్లుంటారు.. మనం ఏవర్గంలో ఉన్నామో అదే ముఖ్యం. మూడు గంటల సినిమాలో ..క్లైమాక్స్ వరకూ విలన్ మాత్రమే సుఖపడతాడు. కాని చివరకు విజయాన్ని మాత్రం హీరో దక్కించుకుంటాడు. అందుకనే పేక్షక హృదయాలలో హీరోకి తప్ప విలన్లకు చోటుండదు. మన పరిస్థితి కూడా అంతే!

మనం అడుగు పెట్టిన నూతన సంవత్సరం ఎంత సఫలీకృతం చేసుకున్నామో అదే మన విజయం. కాబట్టి మీకు అనుకూలమైన ప్రణాళికలు వేసుకోండి. దానిని ఆచరించడానికి కావాల్సిన సాధనాలు సమకూర్చుకోండి. సక్సెస్ కాళ్ల దగ్గరే పడి ఉంటుంది.

గురువారం, నవంబర్ 04, 2021

 దీపావళి శోభ క్షీణించడానికి క్రైస్తవమత వ్యాప్తే ప్రధాన కారణమా?

Is the spread of Christianity the main reason for the decline of Diwali charm?

దీపావళికి నెలరోజుల ముందునుండే ఎంతో హడావుడి ఉండేది. ఒక్క దీపావళి ఏమిటి? హిందూ పండుగలు ఎవొచ్చ్చినా సరే ఆ కొలాహలం, హాడావుడి, సందడి, సంతోషాలు, ఆనందాలు ఒకటేమిటి..ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో విషయాలలో ప్రజలు తేలియాడుతూ ఉండేవారు. పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉండేవారు.

అయితే ఈమధ్య కాలంలో ఇది క్రమేపీ క్షీణిస్తూ వస్తోంది. హిందూ పండుగలన్నీ తమతమ కళను కోల్పోతున్నాయి. పండుగ వాతావరణం పూర్తిగా మటుమాయంయ్యిపోతుంది.

దీనికి కారణం ఏమిటి?

భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న క్రైస్తావమతమా? పెరిగిపోతున్న అధిక ధరలా? 

నిజానికి ధరలు ఎంత పెరిగినా కొద్దో,గొప్పో పండుగలు జరుపుకునే పరిస్థితి హిందూ సమాజంలో ఉంది. తప్ప ధరలు కోసం పండుగలను మానుకునే నైజం హిందువులు కలిగిలేరు. అయినా పండుగలు క్షీణిస్తున్నాయంటే ప్రజలలో మాట విశ్వాసాలు మారిపోతున్నాయి. 

క్రైస్తవ మత స్వీకరణకు గురై  హిందూ విశ్వాసాల పట్ల, హిందూ పండుగల పట్ల ఆసక్తి ప్రజలలో సన్నగిల్లిపోతుంది. ఎంతో ప్రఖ్యాతిగాంచిన పూర్వపు పండుగలన్నీ ఆదరణకు నోచుకోకుండా పోతున్నాయి. దీనికి మరొక కారణం కూడా లేకపోలేదు. మూధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు క్రమేపీ స్వచ్చమైన పండుగలలో కలసిపోయి ఆచరించే ప్రజలలో అయిష్టత కూడా పెరిగింది. ఇవ్వన్నీ పెరిగి హిందూ పండుగలన్నీ అంతరించిపోతున్నాయి.

క్రైస్తవ మతం స్వీకరిస్తే ఆవ్యక్తి ఇక హిందూ మహనీయులను కొనియాడటం గాని, హిందూ ఆచారాలను పాటించటం మానివేయాలని క్రైస్తవ గురువులు బోధిస్తారు. ఇది ఎంతవరకూ వేల్లిపోయిందంటే హిందూ శాస్త్రాలను తాకినా, చదివినా పాపమే.. ఇదే జబ్బు ముస్లిం ప్రచారకులలో కూడా ఎక్కువుగానే ఉంది.

వీరి దొంగ బోధనల ప్రభావానికి సామాన్య జనం అదే మత్తులో ఉంటూ అన్నీ పవిత్ర గ్రంధాలనే భావనకు దూరం జరిగిపోతున్నారు. దీనికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే సనాతనమైన హిందూ శాస్త్రాలు అంటే ప్రజలకు తెలియక పోవడం, వాటి పట్ల అవగాహన కల్పించాల్చిన హిందూ పండితులు ఒక్కొక్కరూ ఒక్కో మార్గం నిర్మించుకుని కొట్టుకు చావడం... ఇవ్వన్నీ వెరసి దీపావళి వంటి పండుగలు సైతం అంతరించిపోతున్నాయి.

Spoken English Whatsapp Group Links

Join English WhatsApp Groups invite links

English Speaking WhatsApp Group Links

English Learning WhatsApp Group Links

Spoken English WhatsApp Groups Link

Latest English WhatsApp Group Links

శుక్రవారం, అక్టోబర్ 08, 2021

 బంధాలు భారమై'పోయా'యా: 🌹

           

relationships advice
relationships advice
Read Also: శక్తి యొక్క 48 సూత్రాలు | 48 Principles of Energy

     మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు.  వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి.  ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.  ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు.  ఇల్లంతా వెతికినా కనిపించవు.  అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది.  అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు.   కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు.  ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి.  బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.  

         రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది.  ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి.  ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది.  ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది.  డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది.  ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ,  అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు.   డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు. 

          ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు.  మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది.  ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము.  మనుషుల మధ్య  ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది.  

     సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి.  అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు.   వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు.  

            అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి.  చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు!  అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే  అమృతం లాంటిది.

                కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు. అది చాలా దుర్భరమైన స్థితి. ఆలోచించండి బంధాలను బలపరుచుకోండి🙏🌹

Best Learning English WhatsApp Groups List

Join English Chat Whatsapp Group Links

All India Jobs Notification Place

Join English Whatsapp group Links - 2021

Active ENGLISH WhatsApp Groups Links 2021

మంగళవారం, అక్టోబర్ 05, 2021

చారు యొక్క గొప్పతనం! | The greatness of the soup!
చారు యొక్క గొప్పతనం! | The greatness of the soup!

చారు యొక్క గొప్పతనం! | The greatness of the soup!

చింతపండు, 

ఇంగువ, 

పోపు దినుసులు, 

ఉప్పు. 

ఈ నాలుగు(చార్)  కీలక  పదార్థాలు  నీటిలో  వేస్తే  తయారౌతుందని  దానిని  చారన్నారో, చాలా  సులభంగా  ఏ  కష్టమూ  లేకుండా  తయారౌతుంది.

పప్పేస్తే  పప్పు  చారు, 

టమాటాలతో  టమాటా  చారు, 

మునగేస్తే  మునగచారు, 

మిరియం  వేస్తే  మిరియాల  చారూ, 

ఏక్  దో  తీన్  చార్  అని  నాలుగు నిమిషాలలో

ఇలా  పాపం  దేనిని  తగిలిస్తే  దానితో  కలగలిసిపోయి  తన  రుచిని  దానికిచ్చేసి  దాని  పసని  తనలో  కలిపేసుకుని  వేడి వేడిగా  తాగినవాడిలో  కొత్త  ఉత్తేజాన్ని  నింపేస్తుంది.


పళ్ళు  రాని  పాపడి  నుంచి   పళ్ళూడిన  తాత  దాకా  మరి  మెచ్చేదే  చారూ  బువ్వ.

అన్న ప్రాసన  తర్వాత  రుచులు  అలవాటయ్యేది  చారుతోటే.

మారాం  చేసే  బుజ్జి గాడికి  గోరుముద్దలు  తినిపించేది  చారుగుజ్జు తోనే.

మీకు  ఉప్మా  నచ్చదా, ఐతే  ఓ రెండు  చెంచాల  చారు  కలుపుకొండి, అమృతమే.

జొరమొస్తే  లంఖణం  తర్వాత  తినిపించేది  చారే.

ఇంట్లో  శ్రీమతికి  కోపం  వచ్చిందంటే(వస్తేనూ)  కంచంలో  తగిలేవి  చారునీళ్ళే అంతే కాదండోయ్   ప్రేమగా  పెడితే  చారంత  రుచికరమైన  వంటకం  మరోటి  ఉంటుందా, నిజం ఒప్పుకోండి 

ఇంట్లో  పెద్దాళ్ళకి  జలుబు  పట్టిందంటే, మరింక  ఆ  రోజు  అందరికీ  చారు  భోజనమే. 

ప్రియే....చారు  శీలే  అన్నారు  గుర్తుందండీ  జయదేవులవారు

*చారు  అంటే  అందమైనది  అద్భుతమైనది  అని..   అలాగే  చారు  బాగా  కాచగలిగిన  ఇల్లాలిని  చారుశీల  అనీ,  చారు  లేందే  ముద్ద  దిగని  భర్తను  చారుదత్తుడు  అని  అంటే  తప్పా చెప్పండి! 

మరి  చారు   తాగే  జయదేవులు   అష్టపదులు  చెప్పుంటారు  లెండి  మరి, ఒడిషా తెలుగు దేశానికి  దగ్గరే  కదా.

మరి  వేడి  చారు  తాగడానికి  సమయం  సందర్భం  అవసరం  లేదని  నా అభిప్రాయం.

వేడి  వేడి  చారు   పొగలు గ్రక్కుతూ  ఇంగువ  ఘాటుతో  కరివేపాకు  ఘుమఘుమలు  ముక్కుకు  తగుల్తూ  ఉంటే  దాని  ముందు  అన్ని పేరొందిన  ద్రవపదార్థాలు  దిగదుడుపే. మరి  కొత్తిమీర  త్రుంచివేసి,  కాచిన  చారైతే  మరింత  రుచి. అద్భుతః,  అమోఘః.

మా  అమ్మమ్మ  పెట్టేది  కుంపటి  పై  కాచిన  సత్తుగిన్నెలో  చారు.

ఆ పోపుకొచ్చిన  ఘాటు  నాకు  ఇప్పటికీ  జ్ఞాపకం.

ఆ  రుచి ఇప్పటికి  మళ్ళీ  చూడలేదు.

మరి  చారు  రుచి  ప్రాంతాన్ని  బట్టి  మారుతుంది.  గుంటూరు  ఘాటు  మిర్చితో  పెట్టిన  చారుదొక  తీరు. ఉత్తరాంధ్రలో  బెల్లంతో  పెట్టిన  చారే  వేరు.

ఇలా  చెప్పుకుంటూ  పోతే, అహో  ఏమి  చెప్పను  చారు

వేడి  వేడిగా  గొంతులో  జారు చెవుల నుండి  వచ్చు  హోరు, 

జలుబు  దగ్గులు  ఓ  గుటకతో  తీరు.

ఇంకే  ద్రవమేనా  చారు ముందు  బేజారు

చార్  మినిట్  మే  బనే చారు ఆ  ఘాటుకు  మాత్రం  నా  జోహారు

మాతృహీన  శిశుజీవనం  వృధా,  కాంతహీన  నవయవ్వనం  వృధా, 

శాన్తిహీనతపసః  ఫలం వృధా,  తింత్రిణీరస  విహీన  భోజనం  వృథా, వృథా!!

తల్లిలేని  పిల్లవాని  బ్రతుకు,

భార్య లేనివాని  యవ్వనం,

శాంతం  లేని  ఋషి  తపస్సు

ఇవన్నీ  ‘చారు’  లేని  భోజనంలా  నిష్ఫలం  అని  పై  శ్లోకానికి  అర్ధం.పి..బ..రే..రా..మా..రసo. 

🙏 స్వస్తి🙏

గురువారం, అక్టోబర్ 01, 2020

 ***ఆలోచింపజేసే విషయం*****రాజకీయ నాయకులు సమాజాన్ని ఏమారుస్తున్నారు*😞😞

1. #మీరు "ఉత్తర కొరియా" సరిహద్దును దాటితే చట్టవిరుద్ధంగా, మీరు closed జైలులో 12 సంవత్సరాల కటిన కులీ పనిచేసే శిక్షా వేస్తారు..

2. #మీరు చట్టవిరుద్ధంగా "ఆఫ్ఘన్" సరిహద్దును దాటితే, అక్కడికి అక్కడే కాల్చివేయబడతారు! 

3. #మీరు "సౌదీ అరేబియా" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు జైలు పాలవుతారు! 

4. #మీరు చట్టవిరుద్ధంగా "చైనీస్" సరిహద్దును దాటితే, మీరు కిడ్నాప్ అవుతారు మరియు మళ్లీ నువ్వు ఉన్నది లేనిది ఎవ్వరికీ తెలియకుండ పోతావు! 

5. #మీరు "క్యూబన్" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు కుళ్ళి చచ్చిపో యెంత వరకు రాజకీయ జైలులో పేడతారు! 

6. #మీరు "బ్రిటిష్" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు, విచారణ చేయబడతారు, జైలుకు పంపబడతారు మరియు మీ శిక్ష అనుభవించిన తరువాత నీ దేశానికి నిన్ను పంపిస్తారు

ఇప్పుడు,

7. #మీరు "భారతీయ" సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటితే, మీరు ఈక్రింది వాటిని పొందవచ్చు

1. #రేషన్ కార్డ్! 

2. #పాస్‌పోర్ట్, ఒకటి కంటే ఎక్కువ కొంచెం స్మార్ట్! 

3. #డ్రైవింగ్ లైసెన్స్! 

4. #ఓటరు గుర్తింపు కార్డు! 

5. #క్రెడిట్ కార్డు! 

6. #సబ్సిడీ అద్దెకు ప్రభుత్వ హౌసింగ్! 

7. #ఇల్లు కొనడానికి రుణం! 

8. #ఉచిత విద్య! 

9. #ఉచిత ఆరోగ్య సంరక్షణ!

10.#తెలంగాణ లో అయితే డబుల్ బెడ్రుమ్ ఇల్లు కూడా

11#.కొసమెరుపు ఏమిటంటే: అవినీతి రాజకీయ నాయకులను ఎన్నుకోవటానికి ఓటు హక్కులు !!!

భారత్ ఏమైనా ధర్మ సత్రం నడుపుతుందా.....??

మనం ఇప్పటికైనా మెలుకొకపోటే ఎప్పటికీ కోలుకొలేము..

🇮🇳 ఓ భారతీయుడా మేలుకో 🇮🇳

సేకరణ : వంశీకృష్ణ దీవి Facebook Timeline నుండి

సోమవారం, ఆగస్టు 24, 2020

కరోనా కు మానవ జాతి ఎందుకు బలవుతోంది?

కరోనా కు మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి  మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC  కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది.  అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.

సోమవారం, జూన్ 15, 2020

ప్రపంచానికి కరోనా వరమా? శాపమా?

China-Virus-Corona-effect-in-world
ఈ పోస్టు చదువుతున్నవారందరూ ఇదేమి ప్రశ్నా? అనుకోవచ్చు. కానీ నిజానికి చాలామంది హృదయాలలో కరోనా భగవంతుడి తరుపునుండి వచ్చిన ఒక వరమని కొంతమంది, ఒక శాపమని మరికొంతమంది భావిస్తున్నారు. 

ఒకరోజు ఉదయం నేను నా మిత్రుడు "ధర్మ"తో ఫోన్లో సంభాషిస్తుండగా ఒక ఆసక్తికర సంఘటన ఒకటి చెప్పుకొచ్చారు. అదేమిటంటే తను "బజార్లో కూరగాయలు తీసుకుంటుండగా ఒక పెద్దాయన మరొకరితో వాదిస్తున్నాడు. " కరోనాను వైరస్ అని అనకండి.. నేను ఒప్పుకోను... అది భగవంతుడి అవతారం.. దుర్మార్గులను అంతమొందించడానికి, నాశనమయిన ప్రకృతిని పునరుద్ధరించడానికి వచ్చింది... మీరే గమనించండి మన పద్ధతులు ఎంత చక్కగా మారాయో ఉన్న సంపదను పొదుపుగా వాడుకోవడం.. క్రమశిక్షణను పాటించడం.. అనవసరంగా బయట బలాదూరుగా తిరుగుడు ఆగిపోవడం... అర్ధరాత్రులు వరకూ తాగి తందనాలాడటం ఆగిపోవడం... కుటుంబ సభ్యులతో గడపటం ఎలా సాధ్యమయింది కరోనా వలన కాదా? సౌండ్ పొల్యూషన్ లేదు, డస్ట్ పొల్యూషన్ లేదు.. రోడ్లు అన్నీ నిర్మాన్యుషంగా, ప్రశాంతంగా లేవా?... పెద్దాయన మాటలు వింటూ ఉంటే వాస్తవమే కదా అనిపిస్తోంది.

ఆదివారం, ఏప్రిల్ 12, 2020


* New war * | *కొత్త యుద్ధం*

( *ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టే కథ... తప్పక చదవండి.*)

corona-virus-new-war
Corona Virus  New war
అది ఒక అందమైన  జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి.

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది.

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది.

‘‘అవును. మాది జింకల వనం!’’

‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా  వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది.

శనివారం, మార్చి 21, 2020

 

Let nature live - it makes us live | ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది

let-nature-live-it-makes-us-live
 Let nature live - it makes us live | ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది
దయచేసి ఇది అందరూ చదవాలి,*
*మిగతా అందరికీ పంచాలి..*
*మనందరికీ కనువిప్పు కలగాలి.*

ఒక సూక్ష్మ జీవి.. కంటికి క‌న‌ప‌డ‌దు. దాన్ని చూసిన వాళ్లెవ‌రూ లేరు. అయినా న్యూయార్క్‌లోని ఒక వెయిట‌ర్‌, బెంగ‌ళూరులోని కూలి, తెలంగాణ‌లోని మొక్క‌జొన్న రైతు, కువైట్‌లోని సెలూన్ వ‌ర్క‌ర్ దాంతో యుద్ధం చేస్తున్నారు. బ‌తుకుని కోల్పోతున్నారు. నిశ్శ‌బ్దంగా అన్నీ కుప్ప‌కూలి పోతున్నాయి.

ఎక్క‌డో చైనాలో వ‌చ్చింది.. మ‌న‌కేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవ‌ర్ యాక్షన్ అనుకున్నాం. త‌మ దేశానికే గోడ క‌ట్టుకున్న మొండివాళ్లు, వైర‌స్‌ని కూడా అంతే మొండిగా త‌రిమేశారు. అది ప్ర‌పంచం మీదికి వ‌చ్చి ప‌డింది. ఇదేదో చిన్న విష‌యం అనుకున్నాం, కానీ ఇట‌లీ ఒక పెద్ద యుద్ధ‌మే చేస్తోంది. ఎంత పెద్ద యుద్ధ‌మంటే.. 80 ఏళ్లు పైబ‌డిన వాళ్లు చ‌చ్చినా ఫ‌ర్వాలేద‌నుకునే యుద్ధం.

సోమవారం, జులై 01, 2019

mother-and-sons
సుమారు పాతికేళ్ల క్రితం...మా ఇంటికి సమీపంలో ఒక కుటుంబం ఉండేది.  తల్లి, కుమారుడు, కోడలు.  ఆమె భర్త చనిపోయాక అతని పెన్షన్ ఆమెకు వస్తుండేది..చాలా స్వల్పమొత్తం.  రెండు వేలో, మూడు వేలో ఉండేది.  ఆమెకు ఆరుగురు కొడుకులు.  అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.  అందరికీ వివాహాలు అయ్యాయి..ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు కూడా.  కొందరు అమెరికాలో స్థిరపడ్డారు.  నగరంలోనే అందరికి సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి.   జీతాలు, పై సంపాదనలు ఎక్కువే.  తండ్రి చనిపోయాక తల్లిని ఎవరు చూడాలి? అని కోడళ్ళు ప్రశ్నించగా కొడుకుల మధ్య చిచ్చు రేగింది.  నీకు ఎక్కువ సంపాదన కాబట్టి నువ్వే చూడాలి అని ఒకరు, నేను ఒక్కడినే ఎందుకు చూడాలి అని మరొకరు..ఈ విధంగా కొట్టుకున్నారు.  ఆ తరువాత ఒక శ్రేయోభిలాషి వారి మధ్యన రాజీ కుదిర్చాడు.  ఒక్కొక్క కొడుకు రెండు నెలల పాటు తల్లిని చూసుకోవాలి అని సూచించాడు.  ఆమె ఉండే ఆ రెండు నెలలకు వచ్చే పెన్షన్ ను ఆ కొడుక్కు ఇవ్వాలి!

గురువారం, మే 09, 2019

is-there-benefit-from-cinema-biopic
 Is there a benefit from cinema biopic?
ఈమధ్య కాలంలో సినిమా బయోపిక్ లు ఎక్కువయిపోయాయి. మహానటి సావిత్రి బయోపిక్ నుండి ప్రతి ఒక్కరి జీవితం మీద బయోపిక్ లు తీయడం ఎక్కువయ్యిపోయింది. కధానాయకుడు, మహానాయకుడు అంటూ ఎన్టీఆర్ పై సినిమాలు తీస్తే "లక్ష్మీస్ ఎన్టీఆర్ " పేరుతొ రాం గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం మీద మరో బయోపిక్ చేసాడు.

ఇవ్వన్నీ సినీ జనాలపై రుద్దటం తప్ప మరేమీ లేదు. వీటిని ధియేటర్ కెళ్ళి చూసేవారికి సమయం,డబ్బూ వృధా తప్ప మరేమీ ఉపయోగం ఉండదని నా అభిప్రాయం.

నిజానికి ఒక వ్యక్తీ బయోపిక్ తీయాలంటే అతని జీవితంలో జరిగిన అన్ని కోణాలూ పరిశీలించాలి. అదెలా సాధ్యం?  దగ్గరి వారి దగ్గర సమాచారం సేకరిస్తే అభిమానం ఉన్నవారు అన్నీ మంచి విషయాలే చెప్తాడు. పెద్ద,పెద్ద తప్పులను సైతం కప్పిపుచ్చడం, అవసరమైతే దారి మళ్ళించే ప్రయత్నం కూడా చేస్తాడు. అదే సేకరణ అభిమానం లేనివాడి దగ్గర చేస్తే అన్నీ తప్పుడు పనుల గురించే చెప్తాడు, బయోపిక్ కి సంబంధించిన వ్యక్తీ యొక్క త్యాగాలను కూడా స్వార్దాలుగా చిత్రీకరిస్తాడు. ఏవిధంగా చూసినా సదరు బయోపిక్ తీయాల్సిన వ్యక్తీ గూర్చి ఏమాత్రం వాస్తవాలు పెద్దగా తెలియజేయలేము. బయోపిక్ ల పేరుతొ వారికి సంబంధించిన అభిమానుల నుండి డబ్భులు గుంజుకోవడం తప్ప మరేమీ లేదు.

శనివారం, మార్చి 02, 2019

ఇంతకీ మనలో మన మాట: మతాలనీ, రాజకీయాలనీ పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రపంచంలో అసలు భారతీయులని మించిన సహనవoతులు ఎక్కడా కనబడరు.
రుజువులు కావాలా? చిత్తగించండి.
* ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బోలెడన్ని వాగ్దానాలు చేసి, గెలిచాక ప్రత్యక్ష నరకంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకునే నేతాశ్రీలని ఏనాదైనా నిలదీస్తామా? ఇది సహనం కాదూ?

* మనకేమో ధరలనీ పన్నుల్నీ తమకేమో జీతాలనీ పెంచుకునే ప్రజాప్రతినిధులని ఇదేం అన్యాయం అని ఎప్పుడైనా అడిగామా? ఇది పరమ సహనవంతుల లక్షణం కాదా?


* రోజూ ఎన్నిరకాల పన్నుల్ని కడుతున్నామో తెలుసుకునే ప్రయత్నం మనలో ఎంతమంది చేస్తాం? అసలు అందుబాటులో లైబ్రరీలే లేనప్పుడు ఆ పేరుతో సెస్సు నెల,నెలా ఎందుకు కట్టాలని గాని, రోడ్ తాక్సులు కడుతున్నాం మరి మంచిరోడ్లు ఏవి అని గాని అడుగుతామా?


* హెల్మెట్ తో తాలని రక్షించుకుంటే చాలా? గతుకులూ, గుంటలూ, ఓపెన్ మాన్ హోల్సులో పడి కాళ్ళూ చేతులూ, నడుములూ విరగొట్టుకుంటే పర్లేదా అని వాదిస్తామా? (కొంపదీసి నిజంగా అడిగేరు- శిరస్త్రాణంతో పాటు శరీరం మొత్తాన్నీ లోహకవచంతో కవర్ చేసుకోండీ అని కొత్త రూలు తెస్తారు జాగ్రత్త)


* రిజర్వేషన్లని అద్దం పెట్టుకుని అత్తెసరు మార్కులు వచ్చినవాళ్లు, నూటికి తొంభై వచ్చినవాదిని తోక్కెసి ముందుకెళ్లిపోయి డాక్టర్లూ ఇంజినీర్లూ అయిపోతుంటే చూస్తూ వూరుకుంటున్నామా లేదా?


           ఎవరక్కడ ఇండియన్స్ కి ఇంటాలరెన్స్ ఎక్కువ అని కూస్తుంట? అతి అయితే గతి చెడుతుందన్నా సామెత ప్రకారం మనకి ఉన్న "అతి" సహనం వల్లే ఈ దుర్గతి, ఈ దుస్థితి! ప్రజలకీ, నాయకులకీ సరైన విషయాల్లో "అసహనం" పెరిగితే బాగుపడతాం!
సేకరణ: 3/12/2015 ఆంధ్రభూమి వారపత్రిక "అద్దంలో మనం" శీర్షిక నుండి.

శనివారం, మే 28, 2016

మా అత్తగారికి, నా సతీమణికి టి‌వి సీరియల్స్ అంటే పిచ్చి. 7pm నుండి ప్రారంభమయ్యే చిన్నారి పెళ్లి కూతురి నుండి 9:30 వరకూ ప్రసారమయ్యే శశిరేఖా పరిణయం వరకూ దేనిని వదలరు. ఆసమయంలో ఇంట్లో దొంగలు పడినా సరే వీరు గమనించే స్థితిలో ఉండరు. కేవలం మా ఇళ్లే కాదండోయ్! మా కాలనీలోని స్త్రీ సమాజం మొత్తం అదే పనిలో ఉంటుంది.
        మా మగ సమాజం ఏదైనా ప్రోగ్రామ్ వీక్షించాలంటే ఈ సీరియళ్ళన్నీ అయిపోయిన తరవాతనే! అంతవరకూ రిమోట్ ముట్టుకుంటే అంతే సంగతులు!
        ఈ బాధ చూడలేక, చూడలేక అత్యధిక మగ సమాజం కూడా క్రమేపీ సీరియల్ చూడడానికే అలవాటు పడిపోయారు...మా మామయ్య గారిలా!!
       ఈ విధంగా రోజులు నడుస్తున్న సమయంలో సర్లే అని నేను కూడా ఒకరోజు రాత్రి అంటే నిన్న రాత్రి "శశిరేఖా పరిణయం" సీరియల్ ముందు కూర్చున్నాను. దానమ్మ..అదేం సీరియల్లో ఒక చిన్న డైలాగ్ చెప్తే చాలు 5 నిమిషాలు అందరి ముఖ కవళికలు జూమ్,జూమ్ అనే మూజిక్ తో చూపిస్తూ ఫ్లాష్ లైట్లు కొడుతూ... ఒక్కసారిగా నాకళ్లు ఆ మెరుపులకు బైర్లు కమ్మాయంటే నమ్మండి. మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది. అదేంటో అరగంట సమయంలో ఆసీరియల్ లో 20నిమిషాలు పాటు అడ్వరటైజ్ మెంట్లు! మొత్తానికి రెండు డైలాగులు 20నుండి 30 ఫేస్ క్లోజప్ లతో సీరియల్ ముగిసిపోయింది. ఒక్క క్షణం ఏమి చూశానో, ఏమి జరుగుతుందో కూడా నాకు అర్ధం కాలేదు. ఈ ఆడజాతికి బుర్ర లేదన్న ఎవరో కవి మాటలు నిజమే అనిపించాయి. ఎందుకంటే వారు ప్రతిరోజూ సీరియల్స్ చూసి,చూసి వాటిలో ఏం జరుగుందో... ఆ కధా కమామీషు ఏమిటో కూడా అర్ధం చేసుకునే పరిస్థితిలో లేరు. అంతెందుకు నాకు తెల్సి ఆ సీరియల్ డైరెక్టర్లకు కూడా ఈ సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ముగించాలో తెలియదనుకుంటా!!

 


Recent Posts