ఈరోజు మనిషి ఫోన్ కి బానిస అయిపోయాడు. తన రోజు వారీ టైంలో అత్యధిక భాగం ఫోన్ కోసమే కేటాయిస్తున్నాడంటే అతిశయోక్తి కాదేమో! తను జ్ఞానాన్ని సంపాదించుకోవడం మానివేసి అబద్దాలతో కూడిన ప్రపంచంలోని చెత్తనంతా తన బుర్రలో నింపుకుని మూర్ఖుడిలా తయారవుతూ మానవత్వాన్ని మంటగలుపుతున్నాడు
దయచేసి మనమందరమూ ఆలోచించాల్సిన విషయం
ముదురు పోయినవారిని ఎలాగూ బాగుచేయలేము...
మన పిల్లల తరాన్ని అయినా బాగు చేయండి...
వారికి సరైన నడవడికను నేర్పాలి...
వాళ్ళకి ఫోన్లను అవసరానికి మించి ఇవ్వకూడదు...
టెక్నాలజీ పెరుగుతున్న విషయం కరెక్టే... కాని ఆ టెక్నాలజీ తన అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి గాని తన జీవితం తన వ్యక్తిత్వం నాశనమయ్యేలా ఉంటే ఎలా?
ప్రతి ఒక్కరూ ముందు తన జీవితం గురించి తెలుసుకోవాలి... నేర్చుకోవాలి దానికి కేవలం పుస్తకాలు మాత్రమే దోహదం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి. పుస్తకాలు మనిషి మెదడును తట్టి లేపుతాయి.
పుస్తకాలు మనిషిలోని జ్ఞానాన్ని బయటికి తీస్తాయి. ఆలోచనాశక్తిని పెంచి పోషిస్తాయి. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి.
కాబట్టి మిత్రులారా కనీసం మన పిల్లల యొక్క తరాన్ని అయినా బాగుచేద్ధాము. పిల్లలలో పటణా శక్తిని పెంచండి. మీరు కూడా పుస్తకాలు చదవడం అలవర్చుకోండి. ఏమి నేర్చుకోకుండా బ్రతకడం కంటే నేర్చుకుంటూ బ్రతకడంలో ఉన్న ఆనందం మరెంద్లోనూ ఉండదు. జైహింద్!!!
0 Comments:
కామెంట్ను పోస్ట్ చేయండి