గురువారం, జనవరి 31, 2019

want-to-have-newest-success-in-new-year
Want to have the newest success in the new year
సైకాలజీ టుడే -జనవరి :2019 సంచిక... పై టైటిల్తో ఒక ఉపయోగకరమైన ఆర్టికల్ వచ్చింది. ఇందులో మనం ఎక్కువుగా కలిగియుండే "వాయిదా వేసే రుగ్మత" గూర్చి చర్చించడం, దానిని వలన వచ్చే భారీ నష్టాలూ, ఎలా వదిలించుకోవాలో తెలియజేసే సూచనలు అందించడం జరిగింది.
ఉదా:-కు ఈ వ్యాసంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇస్తున్నాను.

  • పనులను వాయిదాలు వేయడం అంటే మీ విజయాన్ని మీరే వాయిదా వేసుకున్నట్టు.
  • వాయిదాలు వేయడం ఒక మానసిక రుగ్మత.
  • కొత్త సంవత్సరంలో ఈ రుగ్మతను వదిలించుకోవడానికి గట్టిగా తీర్మానించుకోండి.
  • మనిషి ప్రవర్తన ముఖ్యంగా Pain లేదా Pleasure అనే సూత్రంపై ఆధారపడియుంటుంది. మనం చెయ్యవలసిన అతి ముఖ్యమైన పనిపై అనాసక్తి, కష్టం వుంటే... ఆ పనిని కొంత కాలం తరువాత చాలా శ్రద్దగా చేద్దాం అనే భ్రమలో తాత్కాలికంగా సంతోషం, తృప్తినిచ్చే అనవసరమైన పనుల మీద దృష్టి పెడతారు.
  • ఈ అలవాటు బాల్యంలోనే మొదలవుతుంది. Pleasure Principle ఆధిక్యత చూపిస్తుంది. విద్యార్ధి దశలో టివి, ఆటలు, స్నేహితులు, కాలక్షేపంతో Pleasure పొందుతూ చదువును వాయిదా వేస్తారు. Pleasure కు అలవాటు పడిన విద్యార్ధికి చదువు Painలా అనిపిస్తుంది. చదువును ఆస్వాదించలేక ఒత్తిడి (Pleasure) లేనప్పుడు వాయిదా వేస్తాడు.
  • వాయిదాలు వేసే అలవాటున్న వారిని మానసికంగా ఒక భయం వెంటాడుతుంది. తప్పు జరుగుతుందేమోనన్న భయం, అపజయం పొందుతానేమోననే భయం (Fear of failure) మనసులో మెదులుతూ (ఆలోచిస్తూ) వుంటుంది.

ఇటువంటి అనేక విషయాలు ఈ వ్యాసంలో అందించడం జరిగింది.

ఆదివారం, జనవరి 27, 2019

How-many-Assembly-seats-will-the-Telugu-Desam-Party-win-in-the-2019-elections
చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 2019 లో జరిగే శాసనసభ ఎన్నికలలో భారీ మెజారిటీని సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. TDPకి పోటాపోటీగా వస్తుందనుకున్న YSRCP పార్టీ ఒక్కసారిగా క్రింది స్థాయికి పడిపోయింది. ఆంధ్రా ప్రజలను బూతులు తిడుతూ, పచ్చిగా మాట్లాడే కెసియార్ తో జగన్ మద్దతు తీసుకోవడం చాలా తీవ్రకరమైన విషయం. జగన్ గారి ఈ వ్యవహారం ఆంధ్రాప్రజల మనస్సుల్లో వ్యతిరేక భావన కలిగించిందనే చెప్పాలి. దానికి తోడుగా ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి ప్రజా సమస్యల పట్ల పోరాడకుండా "అసెంబ్లీ"ని వదిలి పెట్టి ప్రజా సంకల్పయాత్ర పేరుతొ ఊర్లంట పాదయాత్ర చేస్తూ తిరగడం నచ్చలేదు. అలాగే కేంద్రంపై తలపెట్టిన అవిశ్వాస తీర్మానం రాక ముందే తన MPల చేత రాజీనామా చేయించడం కూడా పెద్ద తప్పిదమే. అటు మోడీకి నష్టం కలగకుండా చూసుకుంటూ ఇటు మాత్రం ప్రత్యేక హోదా కోసం మా MPలు రాజీనామా చేసారనే భ్రమను జగన్ ఆంధ్రా ప్రజలకు కలిగించలేక బొక్కబోర్లా పడిపోయాడు. ఎన్నుకున్న నాయకులు రాజీనామాలు చేసుకు కూర్చుంటే ఇక ఏం సాధించగలరు? ఇక మరొక ముఖ్య విషయమేమిటంటే "పార్లమెంట్"లో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా కేసీయార్ తన MPల చేత ఎంతగా కుట్రలు చేసాడో మనమింకా మర్చిపోకుండానే కేసీయార్ మద్దతు జగన్ తీసుకోవడం, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జగన్ తరుపున ప్రచారం చేస్తానంటే YSRCP శ్రేణులు తలూపడం...ఇవన్నీ జగన్ కు నష్టాన్ని చేకూర్చేవే. నిజానికి కేసీయార్ మద్దతు జగన్ కు ఏవిధంగా పనికొస్తుందో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు. కెసియార్ నక్కజిత్తుల కుట్రదారుడు. తెలంగాణలో జగన్ గారికి అభిమానులు మెండుగానే ఉన్నారు. వాళ్లందరూ కూడా కేసీయార్, జగన్ తో కలవడం వలన కేసీయార్ కు అనుకూలంగా మారిపోతారు. దీని లాభకోసమే కేసీయార్ జగన్ కు మద్దతు పలికాడు. దీని వలన కేసియార్కు తప్ప జగన్ కు ఏవిధమైన లాభం లేదు. అలాగని కేసియార్ అభిమానులెవరూ ఇక్కడ ఆంధ్రాలో లేనేలేరు జగన్ కు ఓట్లు వేయడానికి. నక్కజిత్తుల కేసీయార్ చేసే కుట్రలకు జగన్ బుక్కయ్యాడంతే. ఇకపోతే చంద్రబాబు తన అభివృద్ధి పనులలో శరవేగంగా ముందుకు పోతున్నాడు. లేటుగా ప్రారంభించినా అతి వేగంగా అన్ని చోట్లా పనులు జరుగుతుండటంతో చంద్రబాబుగారికి ఉపయోగంగానే మారుతుంది. సంక్షేమ పధకాలు కూడా చక్కగానే అమలవుతున్నాయి. ఇవ్వన్నీ చూస్తున్న ఆంధ్రాప్రజలు మళ్ళీ చంద్రబాబుగారి వైపే తిరుగుతున్నారు. ఇదిలానే ఉంటే వచ్చే ఎలక్షన్లలో 175 అసెంబ్లీ స్థానాలకి TDPకి 100సీట్లు పైగా రావడం గ్యారెంటీ. YSRCP 50నుండి 55సీట్ల మధ్యలో గెలుసుకుంటుంది. 10నుండి 15సీట్లు మాత్రమే జనసేన సొంతమవుతాయి. మిగిలిపోయిన అడపాదడపా సీట్లతో వామపక్షాలు అలరిస్తాయి. ఇదంతా నేను నా పరిశీలనతోనూ నాకు అందుబాటులో ఉన్న సమాచారంతోనూ ఏర్పరుచుకున్న అభిప్రాయం మాత్రమే. నాకైతే మాత్రం నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేన పొత్తు చంద్రబాబుకి లేకపోయి 80సీట్లు లోపు మాత్రమే TDP గెలుసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం.

గురువారం, జనవరి 24, 2019

Its-better-to-stay-away-from-being-I-I
మన జీవితకాలంలో ఎంతోమంది వ్యక్తులు పరిచయమవుతూ ఉంటారు. వారిలో కొంతమందితో మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని,కొన్ని సందర్భాలలో కొంతమంది వలన మనం నష్టపోవడమో , లేక మోసపోవడమో కూడా జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది వలనయితే నష్టాలు,మోసాలు జరగకపోయినా మనస్సు మాత్రం విపరీతంగా గాయపడే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు గాని, మాటలుగాని మనకి ఆ పరిస్థితిని తీసుకొస్తాయి.

మనo పై పరిస్థితులకు గురవ్వకుండా ఉండాలంటే మనకు మనం మనతో ఉన్న ప్రతీ వ్యక్తిని పరిశీలించి జాగ్రత్తతో మెలగాలి. అటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తీ యొక్క గుణం ఏమిటంటే "ప్రతిదీ నావలననే సాధ్యం! నేను మాత్రమే, నేను,నేను..నేను" ఇలా మాటలాడే వాడికి కొద్ది జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఎందుకంటే ఈ వ్యక్తిలో ప్రధానంగా...

1.ఇతరులకు క్రెడిట్ దక్కడం చూడలేడు.
2.తనతో ఉన్న మిత్రుల విషయంలో "నల్గురితో ఉన్నప్పుడు తనను హైలెట్ చేసుకుంటూ అతనిని తక్కువ చేసి పరిచయం చేస్తాడు. లేక తక్కువ చేసి మాట్లాడుతాడు.
3.ఎదుటివాడు ఎంత గొప్పగా చెప్పినా? తాను చెప్పేదే గొప్ప అనే అహంకారం నిలువెల్లా కన్పిస్తుంది.
4.తనేదో ఉద్దరించడానికి సృష్టించబడ్డాననే ఫీలింగ్ కు గురవుతూ ఉంటాడు.
5.ఏ పనీ ఊరికనే చేయడు.సహకరించడానికి అసలు ఇష్టపడడు.
6.ఇతరులకు సహాయం చేసే విషయంలో వెనుకకు పోతూ ఉంటాడు.

      కాబట్టి మిత్రులారా "నేను...నేను" అనే వాడి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అతనితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండండి. నిజానికి పై లక్షణాలలో కొన్ని లక్షణాలు అందరిలో లేకపోవచ్చు. కాని మిగతా లక్షనాలున్నా జాగ్రత్త అవసరమే కదా! సహజంగా మనకు పరిచయ వ్యక్తులలో ఏవో కొన్ని లోపాలున్నా వారిలో ఉన్న మిగతా మంచి లక్షణాలను బట్టి ప్రేమించడం అలవర్చుకోవాలి. జాగ్రత్త పడాలి తప్ప సంబంధాలు త్రెంచుకోకూడదు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే "మనలో ఈ గుణాలుంటే వెంటనే రూపుమాపుకోవాలి. లేదంటే మనకు ఉండే మంచి మిత్రులందరూ దూరమయ్యి పోవడం ఖాయం" సన్నిహితులు సహించలేక సైడ్ అయిపోవడం విదితమే!!
Its-better-to-stay-away-from-being-I-I



మంగళవారం, జనవరి 22, 2019

1500పైగా  Dy. Collector jobs, RDO & Other Jobsకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు.

Telangana State (TS) PSC Group 1 Notification 2019

ఆదివారం, జనవరి 20, 2019

Capture-the-wonderful-Ideas-into-your-mind
సహజంగా మనం ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నపుడు, లేదా మనకు తెలియకుండానే ఒకొక్కసారి ఫ్లాష్ లా కొన్ని అద్భుతమైన ఐడియాలు వచ్చి పోతుంటాయి. అవి ఎంత ఉపయోగకరమో మన మనసులకు కూడా స్పురిస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే మనం దానిని తరువాత ఆలోచిద్దాంలే అనుకుంటూ పక్కన పడేస్తాం. ఇక అది మనకు గుర్తుకు రాదు. ఇలా మనకి తెలిసి కూడా ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇలా క్రమీపీ జరగడం వలన మన మేధస్స్ చివరికి మొద్దుగా మారిపోతుంది. ఎటువంటి క్రియేటివిటీ లేకుండా తయారవ్వుతాం. నిజానికి ఎదో సాధించాలి అనే వ్యక్తికి ఇది పెద్ద నష్టమేనని చెప్పాలి.

మరి మనం ఏమి చేయాలి?
ఏమీ లేదు ఎప్పుడు బయటికి వెళ్ళినా, వెళ్లకపోయినా మన వెంట తప్పనిసరిగా చిన్న నోటు బుక్ , ఒక పెన్ మన జేబులో ఉండాలి. ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా వెంటనే దానిని నోట్ బుక్ పై వ్రాసి బంధించి వేయాలి. తరువాత మనకి ఫ్రీ దొరికినప్పుడు తీరిగ్గా దాని పట్ల మరింత కసరత్తు చేయవచ్చు.




బుధవారం, జనవరి 16, 2019

There-are-two-types-of-people-A-man-who-saw-who-ksc-writes
నిజానికి మనం ఏ వర్గంలో ఉన్నామో చూసుకోవాలి. సహజంగా మనం ఏదో చేయాలని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాం. మొదలు పెట్టడానికి మాత్రం చాలా టైం తీసుకుంటాం. కొంతమందైతే అనుకుంటారు గాని ఎప్పటికీ మొదలు పెట్టరు. మరికొంతమందయితే మొదలు పెడతారుగాని విజయం సాధించే వరకూ కృషి చేయరు. అతికొద్ది మంది మాత్రమే విజయం సాధించే వరకూ పట్టు వదలరు. ఇటువంటి వారందరూ చేసేవాళ్ళలోకే వస్తారు. పై మిగతా వారందరూ చూసేవాళ్లలోకే వస్తారు. కాబట్టి మనం చేసేవాళ్ళమా? చూసేవాళ్లమా? అనేది సరి చూసుకోవాలి!

సోమవారం, జనవరి 07, 2019

వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.. ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది ..." పెళ్ళికి నాది ఒకే ఒక షరతు ...."
అతను కుతూహలంగా  చూసాడు..
" అది ఏమిటంటే ఏ మాట మాట్లాడాలనుకున్నా  సరే,
 అంటే విపరీతమైన కోపం వచ్చినా ..... టెన్షన్ వచ్చినా ..... విసుగ్గా వున్నా... ఏదైనా అసలు నచ్చకపోయినా గొంతు పెంచి మాట్లాడకూడదు.. మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే !!!
అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను.. ఆ పై నన్ను ఏమీ అనకూడదు !!!" అన్నది..
అతనికి కొంచెం వింతగా అనిపించినా..తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు....

 


Recent Posts