జ్ఞాన సముపార్జనకు బ్లాగ్ కూడా ఒక మంచి వేదికే! అన్నీ విషయాల మీద బ్లాగర్లు తమ బ్లాగులను వ్రాస్తున్నారు. ఎన్నో మంచి,మంచి బ్లాగులున్నాయి. గొప్ప బ్లాగులున్నాయి. వాటిని మనము చదవడం అలవర్చుకోవాలి. వీలయితే ప్రతి ఒక్కరూ ఒక్క బ్లాగునైనా వ్రాయడం ప్రారంభించాలి. మన అనుభవాలును, మధుర స్మృతులను వ్రాసుకోవడానికి బ్లాగనేది ఒక మంచి వేదిక.
బుధవారం, డిసెంబర్ 04, 2019
బుధవారం, నవంబర్ 20, 2019
- 4:00 PM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
ప్రతిరోజూ సాయంత్రం 7గంటలకు పార్క్ కు వెళ్ళడం నా అలవాటు. ఇంచుమించు రాత్రి 9గంటల వరకు అక్కడే గడుపుతాను. నా ప్రాజెక్టులు,పనుల గూర్చి ఆలోచించుకోవడం ప్లాన్ చేసుకోవడం, నాకొచ్చిన తాట్స్ పుస్తకంపై రాసుకోవడం చేస్తుంటాను. ఎందుకో అలా ఒంటరిగా గడపడం కూడా మనిషినికి ఎక్కడలేని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకనే కాబోలు రోజు వారీ కొంత సమయాన్ని మీతో మీరు బతకండి అని మహానుభావులు ఉద్ఘాటించారు. ఈరోజు మనుషులలో అది కొరవడింది. జీవితాలన్నీ యాంత్రికం అయ్యిపోయాయి. చిన్న,చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతూ పెద్ద దు:ఖానికి మనిషి గురయ్యిపోతున్నాడు.
నాకు తెలిసి మనిషి ప్రతి సమస్యను పట్టించుకోవడం మానివేస్తే దాని ప్రమాదం ఏమీ ఉండదు. సమస్యలే వుండవు. మనం ఎక్కువుగా ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆ సమస్య కాస్తా పెనుభూతమై భయపెడుతుంది. కానీ మనం అలా ఉండకూడదు. సమస్యనే మనం భయపెట్టాలి. సమస్య మూలంలోకి వెళ్లి వేళ్ళను పెకిలించి పారవేస్తే సమస్య అనే వృక్షం కొన్నాళ్ళకి మాడిపోతుంది. నిజానికి మనకు తెలియకుండానే సమస్య తాలూకు విత్తనాలు మనలో వచ్చి పడుతుంటాయి. అవి మనకు తెలియకుండానే మొలకెత్తుతాయి. వీటిని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి. విత్తనాలను మొలకెత్తకుండా నాశనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు,వ్యక్తులు మనలో సమస్య తాలూకు విత్తనాలు వెదజల్లెవారే!
ఇవ్వన్నీ మనకి అర్ధమయ్యేది ఎప్పుడంటే "మనలో మనం బ్రతకడం" నేర్చుకున్నప్పుడే! శుభం!!
నాకు తెలిసి మనిషి ప్రతి సమస్యను పట్టించుకోవడం మానివేస్తే దాని ప్రమాదం ఏమీ ఉండదు. సమస్యలే వుండవు. మనం ఎక్కువుగా ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆ సమస్య కాస్తా పెనుభూతమై భయపెడుతుంది. కానీ మనం అలా ఉండకూడదు. సమస్యనే మనం భయపెట్టాలి. సమస్య మూలంలోకి వెళ్లి వేళ్ళను పెకిలించి పారవేస్తే సమస్య అనే వృక్షం కొన్నాళ్ళకి మాడిపోతుంది. నిజానికి మనకు తెలియకుండానే సమస్య తాలూకు విత్తనాలు మనలో వచ్చి పడుతుంటాయి. అవి మనకు తెలియకుండానే మొలకెత్తుతాయి. వీటిని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి. విత్తనాలను మొలకెత్తకుండా నాశనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు,వ్యక్తులు మనలో సమస్య తాలూకు విత్తనాలు వెదజల్లెవారే!
ఇవ్వన్నీ మనకి అర్ధమయ్యేది ఎప్పుడంటే "మనలో మనం బ్రతకడం" నేర్చుకున్నప్పుడే! శుభం!!
సోమవారం, నవంబర్ 11, 2019
- 10:00 AM
- Sakshyam Education
- No comments
*ఇప్పుడు తరం పిల్లలు బండి తుడవమంటే తుడవరు.*
*మీ సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు...*
*కనీసం అండర్ వేర్ లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు...*
*లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు...*
*ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే నూడుల్స్ ప్యాకెట్లు ఫైవ్ స్టార్ లు ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్ లు కొనుగోలు చేస్తున్నారు...*
*ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు...*
*ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి...*
*డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..*
*తల్లి దండ్రులు మారాలి*
*మీ సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు...*
*కనీసం అండర్ వేర్ లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు...*
*లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు...*
*ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే నూడుల్స్ ప్యాకెట్లు ఫైవ్ స్టార్ లు ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్ లు కొనుగోలు చేస్తున్నారు...*
*ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు...*
*ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి...*
*డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..*
*తల్లి దండ్రులు మారాలి*
సోమవారం, అక్టోబర్ 28, 2019
- 4:50 PM
- Sakshyam Education
- 3 comments
దీపావళి రోజు రాత్రి 9గంటలకు మా ఇంటిల్లిపాది నాలుగు మతాబీలు, రెండు చించూ బుడ్లు కాల్చిన తరువాత ఏదో మంచి మూవీ పెట్టండి చూద్దాం అని మా ఫ్యామిలీ చెపితే సరేనని Movierulz Site ఓపెన్ చేసి "జనతా హోటల్ " సినిమా ప్లే చేశాను. ఈ సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు సరికదా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనసంతా ద్రవించి పోయింది. ఇటువంటి మనసును కదిలించే సినిమాలు ఈమధ్యకాలంలో మన తెలుగులో రావడమే లేదు. అన్నీ కూడా కాపీ కొట్టుడు సినిమాలు. మిత్రులారా మీకు వీలుంటే ఒకసారి "జనతా హోటల్ " సినిమాని చూడండి. Movierulz Site లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకోండి..
Download Link : జనతా హోటల్
శనివారం, అక్టోబర్ 26, 2019
మంగళవారం, అక్టోబర్ 22, 2019
- 6:34 PM
- Sakshyam Education
- Govt Jobs
- No comments
AIU Recruitment 2019 విడుదల అయ్యింది. ఇందులో ప్రధానంగా 8 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
Joint Secretary – 02
Section Officer – 02
Senior Research Assistant – 01
Consultant (Admn) – 01
Consultant (Audit) – 01
Consultant (Legal/ Vigilance) (Part time) – 01
Post Doctoral Fellow – 03
Joint Secretary – 02
Section Officer – 02
Senior Research Assistant – 01
Consultant (Admn) – 01
Consultant (Audit) – 01
Consultant (Legal/ Vigilance) (Part time) – 01
Post Doctoral Fellow – 03
మీకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లయ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఈక్రింది లింక్ ద్వారా వెళ్లవచ్చు.
ఆదివారం, అక్టోబర్ 20, 2019
- 12:34 PM
- Sakshyam Education
- చదువు-సంధ్యలు
- 4 comments
🍁అష్టావధానంలో ఓ కొంటె పృచ్ఛకుడు ఇబ్బందికర పదాలైన పంది,చేప,కప్ప, కోడిపెట్ట అవధానికి చెప్పి,ఈ పదాలు కలుపుతూ ఒక బ్రాహ్మణుడి ఇంట పెళ్లి భోజనము గూర్చి వివరించమని తుంటరి ప్రశ్న వేయగా!*
*ఆ అవధానిగారు ఓస్ ఇంతేకదా అని క్రిందివిధంగా బ్రాహ్మణభోజనము వారికి పెట్టాడు.చదవండి.*
" అందమైనట్టి "పంది"రింట విందుచేయ
బ్రహ్మణుల ఇంట "చేప"ట్టే పరిణయమున
కొసరి మా"కప్ప"డాలు ప"కోడిపెట్ట"
కమ్మనౌ వంటకాలతో కడుపు నింపే ''
*ఆహా..ఏమి మన కమ్మని తెలుగు భాషాతియ్యదనం..*
*అందుకే కదా ! దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు..*
*ఆ అవధానిగారు ఓస్ ఇంతేకదా అని క్రిందివిధంగా బ్రాహ్మణభోజనము వారికి పెట్టాడు.చదవండి.*
" అందమైనట్టి "పంది"రింట విందుచేయ
బ్రహ్మణుల ఇంట "చేప"ట్టే పరిణయమున
కొసరి మా"కప్ప"డాలు ప"కోడిపెట్ట"
కమ్మనౌ వంటకాలతో కడుపు నింపే ''
*ఆహా..ఏమి మన కమ్మని తెలుగు భాషాతియ్యదనం..*
*అందుకే కదా ! దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు..*
- 12:10 PM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
ఇలా అనుకుంటూ ఉంటాము కదూ !
వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .
ఏమయ్యింది ?
1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS
ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . అభిమానుల సానుభూతి వేల్లువయ్యింది .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .
“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేముడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .
“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .
5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,
500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు , వారిలో........
50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు ..........
వారిలో 5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు. ...........
వారిలో 50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు . ..........
వారిలో 4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు . .......
వారిలో ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు ...........
వారిలో నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .
మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?
నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !
నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం
బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?
సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి .
బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది .
విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది
నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు
నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు
ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .
కిందని ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు .
అదే జీవితం !
డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు
అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి .
కానీ అలా జరగడం లేదు .
సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు .
చూడు నేస్తం !
సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !
వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .
ఏమయ్యింది ?
1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS
ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . అభిమానుల సానుభూతి వేల్లువయ్యింది .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .
“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేముడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .
“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .
5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,
500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు , వారిలో........
50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు ..........
వారిలో 5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు. ...........
వారిలో 50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు . ..........
వారిలో 4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు . .......
వారిలో ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు ...........
వారిలో నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .
మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?
నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !
నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం
బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?
సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి .
బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది .
విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది
నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు
నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు
ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .
కిందని ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు .
అదే జీవితం !
డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు
అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి .
కానీ అలా జరగడం లేదు .
సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు .
చూడు నేస్తం !
సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !
మంగళవారం, అక్టోబర్ 15, 2019
- 6:00 AM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
కొన్నేళ్ల క్రితం..భగవంతుని దగ్గరకు చీమలు, దోమలు,ఈగలు,చెట్ల మీద ఉండే పురుగులు,బల్లులూ వెళ్లి..
" స్వామీ ఈ మానవులు పురుగు మందు కొట్టి పురుగుల్ని, చీమల మందు పెట్టి చీమల్ని, నల్లుల్ని, చెదలని, దయ లేకుండా చంపేస్తున్నారు, మాకు ఈ హింస భరించడం చాలా కష్టం గా ఉంది..మా జీవితాల్ని కాపాడు స్వామీ " అని మోర పెట్టుకున్నాయి..
దేవుడు నవ్వి.." నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో వెళ్ళండి అతి త్వరలో మీ బాధలు తీరుతాయి. త్వరలో అంబానీ అనే మహాత్ముడు పుట్టి నిరంతరం పనిచేసే 4g ని ప్రసాదిస్తాడు, అతనికంటే ముందు జుకెన్ అనేవాడు Face Book ఇస్తాడు...ఇంకొకడు whatsapp ఇస్తాడు ..ఇంకొకడు స్మార్ట్ ఫోన్ ఇస్తాడు..అప్పటినుండి మనిషి మిమ్మల్ని పట్టించుకోడు, ఇంట్లో పుట్టలు పెట్టినా పట్టించుకోడు..వాడి పతనం వాడే తెచ్చు కుంటాడు, మీకు అధ్భుతమైన జీవితం ముందుంది " అని వరమిచ్చాడు.
😂🤣😥😂🤣😥😂🤣😥
" స్వామీ ఈ మానవులు పురుగు మందు కొట్టి పురుగుల్ని, చీమల మందు పెట్టి చీమల్ని, నల్లుల్ని, చెదలని, దయ లేకుండా చంపేస్తున్నారు, మాకు ఈ హింస భరించడం చాలా కష్టం గా ఉంది..మా జీవితాల్ని కాపాడు స్వామీ " అని మోర పెట్టుకున్నాయి..
దేవుడు నవ్వి.." నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో వెళ్ళండి అతి త్వరలో మీ బాధలు తీరుతాయి. త్వరలో అంబానీ అనే మహాత్ముడు పుట్టి నిరంతరం పనిచేసే 4g ని ప్రసాదిస్తాడు, అతనికంటే ముందు జుకెన్ అనేవాడు Face Book ఇస్తాడు...ఇంకొకడు whatsapp ఇస్తాడు ..ఇంకొకడు స్మార్ట్ ఫోన్ ఇస్తాడు..అప్పటినుండి మనిషి మిమ్మల్ని పట్టించుకోడు, ఇంట్లో పుట్టలు పెట్టినా పట్టించుకోడు..వాడి పతనం వాడే తెచ్చు కుంటాడు, మీకు అధ్భుతమైన జీవితం ముందుంది " అని వరమిచ్చాడు.
😂🤣😥😂🤣😥😂🤣😥
సోమవారం, అక్టోబర్ 14, 2019
- 10:29 AM
- Sakshyam Education
- వార్తలు - వాయింపులు
- 76 comments
ఆంధ్రా ప్రజలకు ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే టిడిపి పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు బిజెపిలోకి జంప్ అయినా చంద్రబాబునాయుడు గారు వ్యతిరేకించకపోవడం, అలాగే మొన్న వైజాగ్ మీటింగ్ లో చంద్రబాబు ప్రసంగిస్తూ బిజెపిని వీడడం తప్పుడు నిర్ణయమని, వైసిపి రెచ్చగొట్టినందునే టిడిపికి,బిజెపికి విరోధాలు ఏర్పడ్డాయని చెప్పడం బిజెపి మద్దతు ఉన్నట్లు అనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు బిజెపిని దారుణంగానే విమర్శించాలి గాని ఇవేవీ చంద్రబాబు నాయుడుగారు చేయలేదు. నిజం చెప్పాలంటే బిజెపికి చంద్రబాబును మళ్ళీ కలుపుకుపోవడం వలనే ప్రయోజనం గాని జగన్ గారి వలన ఎంటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే చంద్రబాబుకు హైలెవెల్లో ఉన్న సర్కిల్ జగన్ ఏమాత్రం లేదు. ఇకపోతే దేశీయంగా చూస్తే ఏమాత్రం ఇమేజ్ లేని కాంగ్రెస్ ను పట్టుకుని ఉండటం కంటే కేంద్రంలో బలంగా ఉన్న బిజెపినే కలుపుకుంటే ప్రయోజనం. అటు బిజెపికి ఇటు జగన్ కంటే చంద్రబాబు వలెనే ప్రయోజనాలు ఎక్కువ. దానికితోడు చంద్రబాబు యొక్క నేషనల్ ఇమేజ్ కూడా బిజెపి వారికి మరింత ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. ఇవన్నీ కలిసి ఒకవేళ బిజెపి, టిడిపి కలిస్తే జగన్ గారికి గడ్డు కాలం ప్రారంభమయ్యినట్లే... కాదంటారా?
సోమవారం, సెప్టెంబర్ 30, 2019
- 10:00 AM
- Sakshyam Education
- సూచనలు
- No comments
మన భారత దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఆఖరికి నెలల పసికందులను కూడా వదలని కామాంధ రాక్షసులు రోజు,రోజుకూ పెరిగిపోతూనే ఉన్నారు. ఇటువంటి వారు మన ప్రాంతాలలో కూడా ఉండవచ్చు. నిజానికి వీళ్ళు ఆకాశంలోనుంచి రారు. మన చుట్టు ప్రక్కలనే ఉంటారు. మైనారిటీ రాని అబ్బాయిల నుండి కాటికి కాళ్ళు చాపే పండు ముసలి వాళ్ళ వరకూ అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళను మనం TVలలో, వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రాణమైన మన కంటి దీపాలైన ఆడపిల్లలను మనం నిత్యం కాపాడుకుంటూనే ఉండాలి. దీని నిమిత్తం "జనవిజ్ఞాన వేదిక" వారు కొన్ని సూచనలను మనకు అందించారు. వాటిని పరిశీలించి తగు జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యం.
సోమవారం, సెప్టెంబర్ 23, 2019
- 1:09 PM
- Sakshyam Education
- వార్తలు - వాయింపులు
- No comments
జగన్ పనులు చూస్తుంటే మళ్ళీ జగనే సియం అయితే బాగుంటుంది...ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు సియం అయినా పరిపాలన సాగదు..రాష్ట్ర భవిష్యత్ ను ఏమాత్రం పట్టించుకోని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగానే తీసుకెళ్తున్నారు. ఒకవేళ చంద్రబాబు సియం అయినా ఆ బొక్కలన్నీ పూడ్చి మళ్ళీ ఆంధ్రాను గాడిలో పెట్టడానికి ఆయన పదవీకాలం కూడా సరిపోదు. ఇవేవీ తెలియని ప్రజలు చంద్రబాబు వచ్చి చేసిందేమిటి? బొంద అంటూ మళ్ళీ అట్టర్ ఫ్లాప్ విజయాన్ని మూటగడతారు. ఎలక్షన్ల ముందు మరోసారి చంద్రబాబుకి అధికారం ఇద్దాం. ఈసారి పోలవరం,అమరావతి పూర్తవుతాయి అన్న మాటలే ప్రజలు పలికారు. ఒక్క ఛాన్స్ అన్నందుకు జగన్ కు పట్టం కట్టేశారు. ఇంత చేసిన చంద్రబాబును, ఆంధ్రాను గాలికొదిలేశారు. ఇప్పుడు లబో,దిబో మంటున్నారు. ఉపయోగం ఏముంది? నిజానికి జగన్ గారు పోలవరం, అమరావతి ఆపకుండా దానిని తీర్చిదిద్ది ఉంటే తిరుగు లేకపోవును. కానీ చంద్రబాబు మొదలు పెట్టిన ఏపని కొనసాగించడం ఆయనకసలు ఇష్టం లేదు. అందుకే పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు కూడా మూసి పారేశారు. చంద్రబాబుగారు అడుగిడిన ప్రాంతాలు కూడా ఆయనకు నచ్చడం లేదు. ఏదో కోణంలో ఇబ్బడిముబ్బడిగా కేవలం వైయస్సార్ సిపి కార్యకర్తలను ఉద్యోగులుగా మార్చేస్తున్నారు. జగన్ పదవీకాలం పూర్తయ్యేటప్పటికి అన్ని రంగాలలో కేవలం వైయస్సార్ సిపి కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఖర్మకాలి చంద్రబాబు సియం అయ్యి వీళ్ళందరినీ తొలగించినా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవడం ఖాయం. మన ఆంధ్రా సెకండ్ బీహార్ గా మారిపోవడం తధ్యం.
మరొక బాధాకరమైన విషయమేమిటంటే ప్రత్యేక హోదా కోసం తెగ వాగిన చలసాని శ్రీనివాస్ , హైటెక్ లెక్కలు గీసే ఉండవల్లి అరుణకుమార్, భవిష్యత్ కర్త గరుడ శివాజీ, లడ్డూ కావాలా, బొంద కావాలా అంటూ ఓవర్ యాక్టింగ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పచ్చి బూతులు తిట్టిన సోము వీర్రాజు ఇప్పుడు ఏమయిపోయారు?
చంద్రబాబు సియం అయితేనే కానీ వీళ్లకు మళ్ళీ పని దొరకదు. ఎక్కడో బొక్కలలో దాక్కున్న అరుణకుమార్ కూడా మళ్ళీ పద్దుల పుస్తకం పట్టుకుని ప్రజల ముందుకు, మీడియా ముందుకు దూకుతాడు. మనలాంటి సామాన్య ప్రజలు చోద్యం చూస్తున్నట్టు ఉండిపోవడం తప్ప ఏం చేయగలం?
మరొక బాధాకరమైన విషయమేమిటంటే ప్రత్యేక హోదా కోసం తెగ వాగిన చలసాని శ్రీనివాస్ , హైటెక్ లెక్కలు గీసే ఉండవల్లి అరుణకుమార్, భవిష్యత్ కర్త గరుడ శివాజీ, లడ్డూ కావాలా, బొంద కావాలా అంటూ ఓవర్ యాక్టింగ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పచ్చి బూతులు తిట్టిన సోము వీర్రాజు ఇప్పుడు ఏమయిపోయారు?
చంద్రబాబు సియం అయితేనే కానీ వీళ్లకు మళ్ళీ పని దొరకదు. ఎక్కడో బొక్కలలో దాక్కున్న అరుణకుమార్ కూడా మళ్ళీ పద్దుల పుస్తకం పట్టుకుని ప్రజల ముందుకు, మీడియా ముందుకు దూకుతాడు. మనలాంటి సామాన్య ప్రజలు చోద్యం చూస్తున్నట్టు ఉండిపోవడం తప్ప ఏం చేయగలం?
సోమవారం, సెప్టెంబర్ 16, 2019
- 4:46 PM
- Sakshyam Education
- వార్తలు - వాయింపులు
- 3 comments
ఉన్నతమైన వైద్యుడుగా పేరుగాంచి, ఎన్టీఆర్ ప్రోద్బలంతో గొప్ప నాయకుడిగా ఎదిగిన కోడెల శివప్రసాద్ గారు బలవంతపు మరణం ఆంధ్రాను దిగ్బ్రాంతికి గురిచేసింది. నిజానికి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఇలా ఎందుకు జరిగిందో...? కారణాలు..కారకులు ఎవరో?
బుధవారం, సెప్టెంబర్ 11, 2019
- 11:00 AM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
మంచి పుస్తక పఠనానికున్న మహత్తర శక్తి గూర్చి మహనీయుల అభిప్రాయాలు.
1.ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది. - రాయ్ యల్ స్మిత్.
2.మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు.ఎందుకంటే చదివి వినిపించే తల్లి నాకుంది - ఎబిగెయిల్ నాన్ బ్యూరన్
3.నేను పుస్తకాలు కనుగొన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను.- ఆర్చీ మూర్
6.అనేక సందర్భాలలో ఒక పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును రూపుదిద్దింది.-రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
7.పుస్తకాలు లేకుండా ఈ రోజు ఈ స్థానాన్ని నేను ఊహించలేను.పుస్తకాలు స్వేచ్చకు పర్యాయపదాలుగా మారాయి.మీరు తలుపులు తెరిచి నడవవచ్చని అవి చెబుతాయి.- ఓప్రా విన్ ఫ్రీ.
శనివారం, ఆగస్టు 31, 2019
- 9:15 AM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
అడవులలో ఉన్న క్రూర మృగాలకంటే సమాజంలో తిరుగుతున్న క్రూరమైన మనస్తత్వం గల మనుషులే ప్రమాదకరం.
శనివారం, ఆగస్టు 17, 2019
- 3:30 PM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
- తల్లి ప్రేమ కన్నీరుగా మారితే ఆనకట్ట వేసినా ఆగదు.
- ఒకరి తోడుతో పైకి రావాలనుకునే వాడు పైకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ ఒంటరిగా ప్రయత్నం చేసే వాడు మాత్రం తప్పక వచ్చి తీరుతాడు .
- ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ పడటం అజ్ఞానం, నిన్ను నీవు నమ్ముకోవడమే అసలైన జ్ఞానం.
- అతిగా వాగేవాడు,ఎక్కువుగా మాట్లాడే వాడు గౌరవాన్ని కోల్పోవడం ఖాయం.
గురువారం, ఆగస్టు 08, 2019
- 10:36 AM
- Sakshyam Education
- కృతజ్ఞత యొక్క శక్తి
- No comments
కథ లాంటి కథ, కథ కానీ కథ, ఇది మనందరి కథ
ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది,అది చాలా అనారోగ్యం తో, ఈకలు అన్ని రాలిపోయి, తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా ఇలా చెప్పడానికి అలవి లేని బాధల తో, అనారోగ్యం తో, అష్ట దరిద్రాలలో చిక్కుకొని ఉంది.
ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి వెళ్తున్నారు? అని అడిగింది"
అప్పుడు ఆ పావురం, "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.
వెంటనే జబ్బుపడిన పక్షి, స్వర్గం లో ఉన్న అనంత శక్తి అయిన భగవంతుడిని
"దయచేసి నా బాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడూ బయట పడతానో తెలుసుకోండి?"
అని వేడుకుంది,
పావురం "ఖచ్చితంగా, నేను ఆ పని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.
పావురం స్వర్గానికి చేరుకుంది మరియు జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూత ఇన్ఛార్జితో(Angel) పంచుకుంది.
ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది,అది చాలా అనారోగ్యం తో, ఈకలు అన్ని రాలిపోయి, తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా ఇలా చెప్పడానికి అలవి లేని బాధల తో, అనారోగ్యం తో, అష్ట దరిద్రాలలో చిక్కుకొని ఉంది.
ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి వెళ్తున్నారు? అని అడిగింది"
అప్పుడు ఆ పావురం, "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.
వెంటనే జబ్బుపడిన పక్షి, స్వర్గం లో ఉన్న అనంత శక్తి అయిన భగవంతుడిని
"దయచేసి నా బాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడూ బయట పడతానో తెలుసుకోండి?"
అని వేడుకుంది,
పావురం "ఖచ్చితంగా, నేను ఆ పని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.
పావురం స్వర్గానికి చేరుకుంది మరియు జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూత ఇన్ఛార్జితో(Angel) పంచుకుంది.
బుధవారం, జులై 10, 2019
- 11:00 AM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- 1 comment
కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు.ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.
మంగళవారం, జులై 02, 2019
- 1:26 PM
- Sakshyam Education
- Education
- No comments
Andhra Pradesh Open School - Time Table of SSC & Intermediate Public Examinations, July, 2019
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన కాపీలోని పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు.
Andhra Pradesh Open School - Time Table of SSC & Intermediate Public Examinations
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన కాపీలోని పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు.
Andhra Pradesh Open School - Time Table of SSC & Intermediate Public Examinations
సోమవారం, జులై 01, 2019
సుమారు పాతికేళ్ల క్రితం...మా ఇంటికి సమీపంలో ఒక కుటుంబం ఉండేది. తల్లి, కుమారుడు, కోడలు. ఆమె భర్త చనిపోయాక అతని పెన్షన్ ఆమెకు వస్తుండేది..చాలా స్వల్పమొత్తం. రెండు వేలో, మూడు వేలో ఉండేది. ఆమెకు ఆరుగురు కొడుకులు. అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి..ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు కూడా. కొందరు అమెరికాలో స్థిరపడ్డారు. నగరంలోనే అందరికి సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి. జీతాలు, పై సంపాదనలు ఎక్కువే. తండ్రి చనిపోయాక తల్లిని ఎవరు చూడాలి? అని కోడళ్ళు ప్రశ్నించగా కొడుకుల మధ్య చిచ్చు రేగింది. నీకు ఎక్కువ సంపాదన కాబట్టి నువ్వే చూడాలి అని ఒకరు, నేను ఒక్కడినే ఎందుకు చూడాలి అని మరొకరు..ఈ విధంగా కొట్టుకున్నారు. ఆ తరువాత ఒక శ్రేయోభిలాషి వారి మధ్యన రాజీ కుదిర్చాడు. ఒక్కొక్క కొడుకు రెండు నెలల పాటు తల్లిని చూసుకోవాలి అని సూచించాడు. ఆమె ఉండే ఆ రెండు నెలలకు వచ్చే పెన్షన్ ను ఆ కొడుక్కు ఇవ్వాలి!
సోమవారం, జూన్ 24, 2019
- 11:15 PM
- Sakshyam Education
- Govt Jobs
- No comments
బుధవారం, జూన్ 19, 2019
- 10:00 AM
- Sakshyam Education
- No comments
రష్యాలోని మూడు వింత ప్రదేశాలు. | Three wonder places in Russia.
ఇక్కడ మీకు 3 అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వీడియోలను అందిస్తున్నాను. ఈ సంఘటనలు పాత రష్యా దేశంలోని వింతైన ప్రదేశాలలోని జరుగుతున్న వింత వింత విషయాలు. ఒకటోది :- మనం తాగగలిగే మంచి నీరు, పెట్రోల్ లాగా మండటం. రెండోది :- భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉండే ప్రదేశం, అక్కడకు ఏదైనా వస్తువును విసిరితే, అది తిరిగి వచ్చి మనముందుకు వచ్చి పడుతుంది. మూడవది :- ఒక కొలనులోని నీటిలో పెద్ద పెద్ద బరువైన రాళ్ళను వేసిన వెంటనే అవి దూది పింజలాగా పైకి తేలుతాయి. మీరే చూడండి..*_
మంగళవారం, జూన్ 11, 2019
- 12:40 PM
- Sakshyam Education
- చదువు-సంధ్యలు, Education
- 4 comments
ఆంధ్రాలో విలేజ్ వాలెంటరీ పోస్టుల నోటిఫికేషన్ డిటైల్స్ విడుదల అయ్యాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈక్రింది లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
శుక్రవారం, జూన్ 07, 2019
- 8:30 AM
- Sakshyam Education
- వ్యక్తిత్వ వికాసం
- No comments
*👌ఒక మంచి మెసేజ్*
*" ఏంటోనోయ్! అస్తమానూ పెన్ను ఎక్కడ పెట్టానో మరచిపోతూ ఉంటాను"*
*" ఎందుకు అలా ? "*
*" ఏమిటో మరి ఈ మతి మరుపు ! అందుకే నేను ఎప్పుడోఖరీదైన పెన్నులు వాడడం మానేశాను . చీప్ పెన్ను మాత్రమె వాడుతున్నాను . అది మరిచిపోయి పారేసినా బాధ అనిపించదులే ! అయితే నా బాధ ఈ మతిమరుపు గురించే ! "*
.
." *నేను ఒక సలహా ఇవ్వనా* ? "
" *మతిమరుపు పోతుందా* ?"
" *చెప్పలేను ! నీ మీద ఆధారపడి ఉంటుంది* !"
*ఏమిటది* ?
" *నువ్వు కొనగలిగినంత అత్యంత ఖరీదు అయిన పెన్ను కొని వాడుతూ ఉండు . అప్పుడు కూడా నువ్వు మరిచిపోతావా*? ,
*నీ మరుపు పోతుందా? చూద్దాము* "
" *తప్పకుండా చేస్తాను* "
*ఆర్నెల్ల తర్వాత స్నేహితుడు ఫోన్ చేసి పెన్ను మరిచిపోతున్నావా ? అని అడిగాడు*
" *అబ్బే ! నువ్వు చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను కొన్నాను* .
*దాని విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను* .
*ఈ ఆరునెలల్లో ఒక్క రోజు కూడా నేను దానిని ఎక్కడా మర్చిపోలేదు* "
" *నువ్వు పెన్ను మర్చిపోకపోడానికి కారణం నువ్వు దానికి ఇచ్చిన విలువ* ."
*మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము*_ .
*వస్తువుకు విలువ ఇస్తే దాన్ని కోల్పోము*
*ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో , ఏమి తినకూదదో , ఎంత తినాలో , ఎప్పుడు తినాలో అన్నీ జాగ్రత్తగా ఉంటాము*
*నీతి:-*
*స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.*
*డబ్బుకు విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము*
*కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చెయ్యము*,
*బంధాలకు విలువ ఇస్తే వాటిని తెంచుకోము*
*దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకుని వ్యవహరించడం మనం తెలుసుకోవాలి*.
*" ఏంటోనోయ్! అస్తమానూ పెన్ను ఎక్కడ పెట్టానో మరచిపోతూ ఉంటాను"*
*" ఎందుకు అలా ? "*
*" ఏమిటో మరి ఈ మతి మరుపు ! అందుకే నేను ఎప్పుడోఖరీదైన పెన్నులు వాడడం మానేశాను . చీప్ పెన్ను మాత్రమె వాడుతున్నాను . అది మరిచిపోయి పారేసినా బాధ అనిపించదులే ! అయితే నా బాధ ఈ మతిమరుపు గురించే ! "*
.
." *నేను ఒక సలహా ఇవ్వనా* ? "
" *మతిమరుపు పోతుందా* ?"
" *చెప్పలేను ! నీ మీద ఆధారపడి ఉంటుంది* !"
*ఏమిటది* ?
" *నువ్వు కొనగలిగినంత అత్యంత ఖరీదు అయిన పెన్ను కొని వాడుతూ ఉండు . అప్పుడు కూడా నువ్వు మరిచిపోతావా*? ,
*నీ మరుపు పోతుందా? చూద్దాము* "
" *తప్పకుండా చేస్తాను* "
*ఆర్నెల్ల తర్వాత స్నేహితుడు ఫోన్ చేసి పెన్ను మరిచిపోతున్నావా ? అని అడిగాడు*
" *అబ్బే ! నువ్వు చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను కొన్నాను* .
*దాని విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను* .
*ఈ ఆరునెలల్లో ఒక్క రోజు కూడా నేను దానిని ఎక్కడా మర్చిపోలేదు* "
" *నువ్వు పెన్ను మర్చిపోకపోడానికి కారణం నువ్వు దానికి ఇచ్చిన విలువ* ."
*మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము*_ .
*వస్తువుకు విలువ ఇస్తే దాన్ని కోల్పోము*
*ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో , ఏమి తినకూదదో , ఎంత తినాలో , ఎప్పుడు తినాలో అన్నీ జాగ్రత్తగా ఉంటాము*
*నీతి:-*
*స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.*
*డబ్బుకు విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము*
*కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చెయ్యము*,
*బంధాలకు విలువ ఇస్తే వాటిని తెంచుకోము*
*దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకుని వ్యవహరించడం మనం తెలుసుకోవాలి*.
బుధవారం, జూన్ 05, 2019
- 5:30 PM
- Sakshyam Education
- 2 comments
*1. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు.
*2. ధనికులు వారిని వాడుకుంటారు.
*3.సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
*4.పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.
*5.తిరుగుబోతు, పై నలుగురి బదులుగా విశ్రాంతి తీసుకుంటాడు.
*6.తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
*7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని దోపిడి చేస్తుంటాడు.
*8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ పట్టిస్తుంటాడు .
*9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి డబ్బు తీసుకుంటాడు .
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ పాతిపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు
*ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి క్రీ.పూ.43 నాటివి ! *
*2. ధనికులు వారిని వాడుకుంటారు.
*3.సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
*4.పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.
*5.తిరుగుబోతు, పై నలుగురి బదులుగా విశ్రాంతి తీసుకుంటాడు.
*6.తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
*7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని దోపిడి చేస్తుంటాడు.
*8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ పట్టిస్తుంటాడు .
*9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి డబ్బు తీసుకుంటాడు .
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ పాతిపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు
*ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి క్రీ.పూ.43 నాటివి ! *
ఆదివారం, మే 26, 2019
- 7:30 AM
- Sakshyam Education
- No comments
vijaya rahasyalu-yandamoori |
vijaya rahasyalu-yandamoori
నాకు నచ్చిన యండమూరి రచనల్లో ఒక మంచి పుస్తకం "విజయ రహస్యాలు : టీచర్లు చెప్పనివి - పెద్దలకు తెలియనివి". ఈ పుస్తకం చదివితే చదవని వారికి "చదువు"ను కొనసాగించాలనిపిస్తుంది. చదివే వారికి మరింతగా చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ పుస్తకంలో యండమూరి వారు ఎన్నో అద్భుతమైన సలహాలు, సూచనలు అందించారు. వీలయితే మీరు తప్పక చదవండి. మీ పిల్లల చేత చదివించండి.
చదువంటే విద్యాలయంలో నేర్చుకున్నదంతా మర్చిపోయిన తర్వాత చివరకు మిగిలేది - ఆల్బర్ట్ ఐన్ స్టీన్.
మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది. మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారూ దీపం కాలేకపోవచ్చు. కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం. - అరిస్టాటిల్.
Read More : స్నేహితులు ఎన్ని రకాలు ఉంటారు? వారిని గుర్తించటం ఎలా?
Read More : స్నేహితులు ఎన్ని రకాలు ఉంటారు? వారిని గుర్తించటం ఎలా?
గురువారం, మే 23, 2019
- 2:48 PM
- Sakshyam Education
- No comments
Congratulations to the new Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy. |
సోమవారం, మే 13, 2019
- 6:30 PM
- Sakshyam Education
- 3 comments
🍥 సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.
🍥 ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.
🍥 సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసుని తాకింది.
🍥 ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.
🍥 సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసుని తాకింది.
గురువారం, మే 09, 2019
- 7:37 AM
- Sakshyam Education
- ఆలోచనలు
- 3 comments
Is there a benefit from cinema biopic? |
ఇవ్వన్నీ సినీ జనాలపై రుద్దటం తప్ప మరేమీ లేదు. వీటిని ధియేటర్ కెళ్ళి చూసేవారికి సమయం,డబ్బూ వృధా తప్ప మరేమీ ఉపయోగం ఉండదని నా అభిప్రాయం.
నిజానికి ఒక వ్యక్తీ బయోపిక్ తీయాలంటే అతని జీవితంలో జరిగిన అన్ని కోణాలూ పరిశీలించాలి. అదెలా సాధ్యం? దగ్గరి వారి దగ్గర సమాచారం సేకరిస్తే అభిమానం ఉన్నవారు అన్నీ మంచి విషయాలే చెప్తాడు. పెద్ద,పెద్ద తప్పులను సైతం కప్పిపుచ్చడం, అవసరమైతే దారి మళ్ళించే ప్రయత్నం కూడా చేస్తాడు. అదే సేకరణ అభిమానం లేనివాడి దగ్గర చేస్తే అన్నీ తప్పుడు పనుల గురించే చెప్తాడు, బయోపిక్ కి సంబంధించిన వ్యక్తీ యొక్క త్యాగాలను కూడా స్వార్దాలుగా చిత్రీకరిస్తాడు. ఏవిధంగా చూసినా సదరు బయోపిక్ తీయాల్సిన వ్యక్తీ గూర్చి ఏమాత్రం వాస్తవాలు పెద్దగా తెలియజేయలేము. బయోపిక్ ల పేరుతొ వారికి సంబంధించిన అభిమానుల నుండి డబ్భులు గుంజుకోవడం తప్ప మరేమీ లేదు.
మంగళవారం, ఏప్రిల్ 23, 2019
- 9:00 AM
- Sakshyam Education
- 1 comment
_**ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఇంతలో దగ్గరలో ఏవో అరుపులు వినిపించాయి, వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి రక్షించండి, కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు..*_
_**తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగింది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వచ్చాడు, ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? అని అడిగాడు రైతు."నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి " అంటూ ఒక ఇనప్పెట్టె ఇచ్చాడు.*
_**తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగింది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వచ్చాడు, ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? అని అడిగాడు రైతు."నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి " అంటూ ఒక ఇనప్పెట్టె ఇచ్చాడు.*
ఆదివారం, ఏప్రిల్ 14, 2019
- 2:42 PM
- Sakshyam Education
- వార్తలు - వాయింపులు
- 3 comments
Andhra people vs KCR |
ఆంధ్రాప్రజలు కుక్కలు,నక్కలు,రాక్షసులు అంటూ ఆంధ్రా వెధవలతో సంబంధాలు తెగ్గోట్టేసు కోవాలని కారుకూతలు కోసిన కెసియార్ ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నాడు?
జగన్ సియం చేయండి...మీకు (ఆంధ్రాకు) ప్రత్యేక హోదా నేనిప్పిస్తా అంటూ కెసియార్ చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేము. కెసియార్ ఇప్పిస్తే గాని మనం తెచ్చుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి దిగజారిపోయామా?
ఏది,ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు..జగన్ సియం చేస్తే కేసియార్ను సియం చేసినట్టేనని. అంటే ఆంధ్రాపై కెసియార్ ఆధిపత్యం చేయడానికే జగన్ కు సపోర్ట్ చేయడం. ఎందుకంటే చంద్రబాబు సియం అయితే కెసియార్ ఆటలు అసలు సాగవు. ఎందుకంటే YSRCP నాయకుడు విజయసాయి అన్నట్లు చంద్రబాబు ఎవరికీ లొంగడు. అయితే జగన్ కేసియార్కు, మోడీకి చేతులు ఎత్తి పూర్తిగా లొంగిపోవడానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రాలో జగన్ పై ఉన్న కేసులే. అవ్వన్నీ పట్టుకుంటే ఎక్కువ కేసులు కెసియార్ (తెలంగాణ) పరిధిలోకే పోతాయి. ఇవి గాని పట్టుకుని కెసియార్ లాగాడంటే జగన్ గారు పరిస్థితి ఊహించడానికి కూడా దారుణంగా ఉంటుంది. దీని కారణంగానే జగన్ కేసియార్కు, మోడీకి కీలుబొమ్మ మాదిరిగా మారిపోయేడు.
శనివారం, ఏప్రిల్ 06, 2019
- 8:43 AM
- Sakshyam Education
- 2 comments
గౌరవనీయులైన తెలుగు బ్లాగులోకంలోని బ్లాగరు మిత్రులకు, బ్లాగు వీక్షక మహాశయులకు, అగ్రిగేటర్ యజమానులకు, ఇంత సేవా ఫ్రీగా అందిస్తున్న గూగులమ్మకు అందరికీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
మంగళవారం, ఏప్రిల్ 02, 2019
- 8:19 PM
- Sakshyam Education
- No comments
వాట్స్ ఆప్ (WhatsApp) లో మనకు ఏదేని ఒక సందేశం వస్తే టిక్ "✓" మార్క్ పడుతున్నది అందరికీ విధితమే. ఐనా ఆ టిక్ మార్కుల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిదేమో మరి...
*టిక్ [✓]సంకేతాల వివరాలు:*
> ఒక టిక్ [✓] మార్క్ పడితే సందేశం (Message) పంపించినట్టు;
> రెండు టిక్ మార్కులు [✓✓] పడితే సందేశం చేరినట్టు;
> రెండు టిక్ మార్కులు [✓✓] నీలం రంగుకు మారితే, ఆసందేశాన్ని చదివినట్టు;
> మూడు నీలం రంగు (Blue) టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు;
> రెండు [✓✓] నీలం (Blue) టిక్కులు మరియు ఒక [✓] ఎరుపు (Red) రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.
*"ఈ సందేశం మీవరకే పరిమితం కాక మీ బృందాలకు కూడా తెల్పగల విశాల హృదయం కలిగిన మీకు శుభోదయం
*టిక్ [✓]సంకేతాల వివరాలు:*
> ఒక టిక్ [✓] మార్క్ పడితే సందేశం (Message) పంపించినట్టు;
> రెండు టిక్ మార్కులు [✓✓] పడితే సందేశం చేరినట్టు;
> రెండు టిక్ మార్కులు [✓✓] నీలం రంగుకు మారితే, ఆసందేశాన్ని చదివినట్టు;
> మూడు నీలం రంగు (Blue) టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు;
> రెండు [✓✓] నీలం (Blue) టిక్కులు మరియు ఒక [✓] ఎరుపు (Red) రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.
*"ఈ సందేశం మీవరకే పరిమితం కాక మీ బృందాలకు కూడా తెల్పగల విశాల హృదయం కలిగిన మీకు శుభోదయం
సోమవారం, ఏప్రిల్ 01, 2019
- 9:15 AM
- Sakshyam Education
- No comments
రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.
ఆమె పిల్లలు పడుకున్నారు!
భర్తకుర్చీలో కూర్చొని తనస్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.
చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.
ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికిభర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!
"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.
"నిన్న నా సెకండ్ క్లాస్ ♂♀🧑🏻⚖విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా✍రాసుకుని రమ్మని.
"అయితే...?"
"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే 🤣ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"
భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం✍ రాశాడు?"
హెడ్డింగ్ ఇలా పెట్టాడు
*"నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."*
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళుస్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. 🏻నాకన్నా ఎక్కువగా...!!
నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికిస్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది.నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా🏻కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!
అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ... 🏻నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!! ...
నేను 🤣ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు 🏻నాతో కాకుండాస్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు🏻నాతో కన్నాస్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!
వాళ్ళు తమస్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు 🏻నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది🏻నాకు ముఖ్యమైన విషయమైనా సరే!
అదే ఒకవేళ🏻నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!
అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానేదాన్నే చేతిలోకి తీసుకుంటారు!!
కాబట్టి! నా కోరిక ఏమిటంటే... 🏻నేను అమ్మానాన్న చేతిలో ఉండేస్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!
భార్య చదువుతుంటే... విన్న భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి🤣 వస్తుండగా...
"ఎవరు రాశారది? "✍ అడిగాడుభార్యని.
"మన కొడుకు"🏻అంది భార్య 🤣కన్నీరు కారుతుండగా!
వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!
అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......ఇది నిజంగా జరిగిన కథ.. కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి...
వాట్సాప్ నుండి సేకరణ : ప్రతి తల్లితండ్రులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో పోస్ట్ చేసాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)