బుధవారం, ఆగస్టు 30, 2017


TAGS : Why is Gandhi's picture printed on currency notes?

మంగళవారం, ఆగస్టు 29, 2017

Take-advantage-of-the-art-of-choosing-the-right-time
ఎప్పుడూ కూడా తొందర పడుతున్నట్టు కనిపించవద్దు-తొందరపడటం వల్ల మీమీద మీ సమయం మీదా మీకు నియంత్రణ లేదని తెలుస్తుంది. ఎప్పుడూ ఓర్పు కనబరచండి. చివరికి అంతా మీరనుకున్నట్టే జరుగుతుందని తెలిసినట్టు ఉండండి. సరైన క్షణాన్ని వెతికి పట్టుకునే అపరాధ పరిశోధకుడిలా పని చెయ్యండి. కాలం తాలూకు ఆత్మని పసిగట్టండి, కాలవైఖరే మిమ్మల్ని శక్తిని పొందే స్థితికి తీసుకువెళ్తుంది. సరైన సమయం ఇంకా రాలేదనుకున్నప్పుడు వెనక్కి తగ్గటం నేర్చుకోండి. అదే సమయం వచ్చినట్టనిపించినప్పుడు బలమంతా ఉపయోగించి ప్రయత్నించండి.

TAGS : Take advantage of the art of choosing the right time!

శుక్రవారం, ఆగస్టు 25, 2017

Anything that is okay is dolsinde.
ఉరుకుల పరగుల జీవితం లో ఏకాంతంగా .. ప్రశాంతంగా గడపడానికి సమయం ఎక్కడ వుంటుంది. అయినా అలా గడపాల్సిందే అంటున్నారు నిపుణులు . దానివల్ల శారికంగా ,మానసికంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయి .అవేంటంటే ..
ప్రతిరోజూ ఎంతో కొంత సమయం ఎకాంతంగా గడపడానికి అందరికీ కుదరకపోవచ్చు.  కానీ వారంలో కనీసం ఒక సారైనా అందుకోసం సమయం కేటాయించుకోండి. అలా చెయ్యడం వల్ల ఆలోచనా తీరు మారుతుంది .కేవలం మీతో ముడిపడిన  బావాలే మనసు లో మెదులుతాయి .చిరాకూ ,విసుగూ పక్కకు వెళ్ళిపోయి .. ఒత్తిడి తగ్గుతుంది .
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే ఏదో ఒక సలహా ఇస్తారు. కొన్ని సమస్యల్ని ఎవరితోనూ పంచుకోవాలనిపించదు.  అలాంటప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఓ గంటపాటు ఉండండి. సమస్య గురించి ఆలోచించి .. దానికి పరిష్కారాలను కూడా మీకు మీరుగా సూచించుకోండి. .మంచీ చెడులను విశ్లేషించుకోండి. మీతో మాట్లాడుకోవడమంటే ఇదే. ఇతరుల ప్రభావం లేకుంటే ఇదే.  ఇతరుల ప్రభావం లేకుండా స్వయంగా నిర్ణయం తీసుకోవడం ఇలా సాద్యమవుతుంది.

ఎన్ని వ్యాపకాలున్నా సరే అభిరుచులకు ప్రాధాన్యమివ్వడం వల్ల సానుకూల దృక్పథo  పెరుగుతుంది. డ్రైవింగ్ క్లాస్ లకు వెళ్ళడం ,తోట పని చేయ్యడం.. ఈత నేర్చుకోవడం వంటివి దూరమవుతాయి. 

ఒంటరిగా షాపింగ్ కు వెళ్ళడం కూడా మనకోసం మనం గడపడమే! ఎవరి ఎంపికా లేకుండా మనసుకు నచ్చినవి ఎంచుకోవడం...గౌవించుకోవడమే!

కొన్ని సార్లు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం వుంటుంది. కానీ ఆవేశం, కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా వుండడం మంచిది. ఒంటరితనం ఆవేశాల్ని తగ్గిస్తుంది. మనసును నిదానపరుస్తుంది. మనతో మనం మాట్లాడుకోవడం...మంఛిచెడులను బేరీజు వేసుకోనే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోo. అధిక రక్తపోటూ తగ్గుతుంది.  

మంగళవారం, ఆగస్టు 22, 2017

This-is-also-the-tusk-of-the-Tulus-of-August-21-2012
ఆగస్ట్ 21-2017 రోజునాడు భూమి నాశనం కానుంది ఒకవైపు, అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి ఆ దేశమంతా చీకటిలోకి వెళితే ఇక వెలుగులోకి రాదు నాశనం కానుందని మరో వైపు ఇలా అన్ని ప్రక్కల నుండి మన టీవీ వాళ్ళు ఊదరగొట్టి పాడేశారు. ఆగస్ట్ 21-2017 వెళ్ళిపోయింది ఏం జరిగింది? ప్రళయమెక్కడ వచ్చింది? ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేస్తున్నామంటే అందులో వాస్తవం ఉండాలి. అంతేగాని TRP రేట్లు పెంచుకోవడం కోసం అడ్డమైన విషయాలు తీసుకుని వచ్చి ప్రజలపై రుద్దాలని ప్రయత్నించకూడదు. మన మహనీయులైన, శాస్త్రాలైనా ప్రళయం వచ్చే ముందు కొన్ని సూచనలు సూచించారే గాని ఫలానా సమయంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు. ఇవేవీ పట్టించుకోకుండా అదిగో ప్రళయం, ఇదిగో ప్రళయం అంటూ ఊదరగోట్టడం దేనికసలు? 2000లో ప్రళయం అన్నారు రాలేదు. ఇంకేముంది 2012లో మొత్తం భూమంతా ఖాళీ అయ్యిపోతుందన్నారు అవ్వలేదు. కొంతమందయితే బ్లాగుల్లో కూడా అదిగో,ఇదిగో అంటూ జ్యోస్యాలు వ్రాసేస్తున్నారు! ఇప్పుడా జ్యోతిష్యం అబద్దమనే కదా అర్ధం. ఇప్పుడు మళ్ళీ 2020 అంటున్నారు. ఈ సంవత్సర అంకెలు బాగున్నాయి కదా! ప్రజలు నమ్ముతారులే అనే ఉద్దేశ్యం కాబోలు. వాళ్లనుకున్నది నిజమే అనుకుంటా ఇవి నమ్మే ప్రజలకు బుర్రలు పనిచేస్తేనే కదా? వాళ్ళు చెప్పేది అబద్ధమని అర్ధమయ్యేది!!

మంగళవారం, ఆగస్టు 15, 2017

I-congratulate-Indian-Independence-for-all-my-friends
ప్రియమైన బ్లాగ్ మిత్రులారా మీ అందరికీ నా తరపున, సాక్ష్యం గ్రూప్ తరుపున 71వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

మనకి నిజమైన పండుగ ఆగస్ట్ 15 నాడు మాత్రమే. ఎందుకంటే ఈరోజు మనం బ్రిటీస్ బానిసత్వం లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకి స్వాతంత్ర్యం సాధించి పెట్టారు. దానికి కృతజ్ఞతగా మనమందరమూ ఆ వీరోచిత స్వాతంత్ర్య సమరవీరులందరినీ జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులు అర్పించుకుందాము.

జై భారత్...జై హింద్.

సోమవారం, ఆగస్టు 14, 2017

ఈక్రింది సందేశాత్మక వ్యాసం నా Facebook అకౌంట్ లో చదివాను. చాలా బాగుంది అనిపించి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. దీనిపై మీ అమూల్యమైన కామెంట్ ఒకటి పడెయ్యండి చాలు.

ఇదేనా నా దేశం?
ఇదేనా నా బగత్ సింగ్ కలలు కన్న స్వరాజ్యం?
ఈ దేశం కోసమేనా నా అల్లూరి తెల్లవాడి ముందు రొమ్ము విరిచింది?
దీని కోసమేనా నా సుబాష్ చంద్ర బోస్ ప్రాణాలు అర్పించింది?
ఈ రోజు చూడదానికేన నా గాంధీ బ్రిటిష్ వాడికి ఎదురొడ్డి నిలిచింది?
మంత్రులు,ముఖ్యమంత్రులు
ఎవడు కాదు అవినీతికి అర్హులు..
నేటి రాజకీయాలకు కొలమానం దేశానికి ఏమి చేసాం అనడం కంటే నా వాళ్ళకు నేను ఎంత సంపాదించుకున్నాను..
ఇది నిజం.
నమ్మలేని నిజం..
మన రాజకీయ నాయకులూ ఒప్పుకోని నిజం…
వాళ్ళ జేబు నింపుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చిన తప్పు లేదు.
కాని,
పేదోడి కోసం మాత్రం ఈ రాజ్యాంగమే పెద్ద తప్పు…
నేను చేస్తే ఒప్పు, అదే ఎదుటివాడు చేస్తే తప్పు..
నేను బాగుండాలి,నా కుటుంబం బాగుండాలి..
కాని,
నాకు ఓటు వేసిన వాళ్ళు మాత్రం నాశనం కావాలి..
ఇవే నేటి రాజకీయానికి ప్రాధమిక సూత్రాలు…
నా తెల్లని దేశం ఫై నల్లని సిరా తో పెదోడిని చంపడానికి విషపు రాతలు రాస్తున్న
ఓ అవినీతి రాజకీయ నాయకుడ కబద్ధార్..
తప్పు చేసిన వాడి చోక్క పుచ్చుకు అడిగే రోజు ఎప్పుడు ఒస్తుందో కాని
ఆ రోజే నా భారతమాత కి నిజమైన స్వాతంత్రం..
అదే మా యువత కలలు కంటున్నస్వరాజ్యం…

Is this my country?
Is this the dream of my dream Bagat Singh?

శనివారం, ఆగస్టు 12, 2017

that is narendra modi
ప్రజలను మిమ్మల్ని MPలను చేసింది తినేసి ఇళ్ళ దగ్గర పడుకోవడానికి కాదు..పని చేయడానికంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడి తన పార్టీ MPల తీరుపై విరుచుకుపడ్డాడు. వాళ్ళు సరిగా సభలకు రాకపోవడంపై విసుకు చెందిన మోడి పైవిధంగా స్పందించారు. అంతే కాకుండా మీరు పధ్ధతి మార్చుకోకపోతే వచ్చే 2019 ఎలక్షన్స్ లో సీటు ఇవ్వడం కష్టమేనని కూడా తేల్చేస్తూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

మోడీ విషయంలో ఇవ్వన్నీ చూస్తుంటే త్వరలో మన ప్రధాని మోడీ గారు భారతదేశానికి ఎదురులేని రాజుగా,నియంతగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా మోడీ ఎప్పుడు,ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియక అనుక్షణం భయంతో బ్రతుకుతూనే ఉన్నారు.

ఏది,ఏమైనా MPల, MLAల మద్దతు కోసం ప్రాకులాడుతూ పరిపాలక సీట్లలో కూర్చుని కూడా ఏమీ చేయలేక మద్దతు ఎక్కడ ఊడుతుందో, అధికారం ఎక్కడ చేజారిపోతుందోనని భయపడి తన క్రింది సభ్యులకు బానిసలుగా మారిపోయే ముఖ్యమంత్రి,ప్రధానమంత్రుల పదవులకు దీటుగా ప్రధాని మోడి MPలకు లొంగక పోవడం గొప్ప విషయం. ఇదే నిజమైన ప్రధానమంత్రి పీఠానికి ఇచ్చే గొప్ప గౌరవం.

పదవిలో ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు.ఎలా పరిపాలించాము? అన్నదే ముఖ్యం. దీనిని బట్టే భరతమాత ముద్దు బిడ్డలుగా మిగిలేది.చూద్దాం మన ప్రధాని నరేంద్రమోడి పరిపాలన సాగినంత కాలం భరతమాత ముద్దు బిడ్డగా ఉంటాడో,లేదో!!

శనివారం, ఆగస్టు 05, 2017

నిహారికా గారు తెలుగు బ్లాగుల లోకానికి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. నిజానికి నిహారికా మేడం గారిలాంటి బ్లాగర్లు ఉంటే బ్లాగ్ ప్రపంచానికి కాస్త ప్రోత్సాహం, ఉత్సాహం వస్తాయి. ఇంకా ఎంతో మంది మంచి బ్లాగర్లు రావల్సివుంది. వారందరూ మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచానికి తిరిగి రావాలని కోరుకుందాం. మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచం పూర్వపు వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం! శుభం.!!!

Welcome back to the blog of Nehika Madam

 


Recent Posts