మంగళవారం, ఫిబ్రవరి 09, 2016

తునిలో కాపు గర్జన పేరుతో జాతీయ ఎక్స్ ప్రెస్ ట్రైన్ "రత్నాచల్" ను తగులబెట్టేశారు. ఈ అసాంఘిక సంఘటనకు నేను ప్రారంభించిన ఉద్యమానికి ఏవిధమైన సంబంధం లేదని ముద్రగడ వారు ప్రకటించేశారు. పేపర్లలో,టి.వి.లలో మాత్రం దీని వెనుక జగన్ ఉన్నాడని, రాయలసీమ,హైద్రాబాద్ నుండి కొంతమంది ముసుగు రౌడీలు ప్రవేశించి ఈ ఘాతుకం చేశారని వచ్చింది. అదే నిజమైనప్పుడు జగన్ ను మళ్ళీ జైల్ గోడల మద్యకు ఎందుకు నెట్టలేదో ఆంధ్ర ప్రజలెవరికీ అర్ధం కావడం లేదు. రౌడీల ఆగమనం చూస్తుంటే రత్నాచల్ ట్రైన్ తగుల బెట్టేయాలని ముందే ప్లానింగ్ జరిగిపోయినట్టు అనిపిస్తోంది. అంటే కాపు గర్జన సభలో పాల్గొన్న రాజకీయ పెద్దలకు ముందే తెలుసేమో అన్పిస్తోంది. ఎవరేమి పన్నాగాలు పన్నినా మొత్తానికి ఆంధ్రాలో కుల చిచ్చులు రేపారు. నిజానికి ఈ కుల రాజకీయాలు ఎంతో కాలం నిలవవు. ఈ కుల రిజర్వేషన్స్ నిలవవు. వీటికి ముగింపు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. 

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts