ఆదివారం, డిసెంబర్ 20, 2015

తెలుసుకోవాలనుకుంటున్నారా? వినుకోండి మరి... జంతువులూ,పక్షులూ తెల్లవారు జాము నిద్ర లేచిపోతాయి. మనిషి నిద్ర లేవడు. మార్నింగ్ 8గంటలైనా నిద్రలేవడానికి బద్దకిస్తాడు. లేచిన తరువాత .హడావుడి పనులతో హైరానా పడిపోయి హార్ట్ కు చిల్లులు కూడా పెట్టుకుంటాడు. జంతువులు, పక్షులు బాడీకి సరిపడా నీళ్ళు త్రాగుతాయి. మనిషి త్రాగడు. టీలు,కాపీలు త్రాగి,త్రాగి కడుపు నిండా కఫం పెంచుకుని మాయదారి రోగాలతో సతమతమవుతుంటాడు. జంతువులు,పక్షులు ప్రతిరోజూ పెండలకాడనే బొచ్చుంటాయి. మనిషికి తీరిక ఉండదు. అర్ధ రాత్రులు ఎప్పుడో మంచం పై అటు,ఇటూ సరిగా నిద్రపట్టక దొర్లుతాడు. కాదంటారా? మొన్న నేషనల్ జియోగ్రఫిక్ చానెల్లో అడవి రాజు పులి ఇంటర్వూ వచ్చింది. అవ్వన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలని చూస్తున్నాయట? అత్తారింటికి దారేది? సినిమాలో హీరో మాతో పోల్చుకోవడం చాలా అవమానంగా ఉందని భావిస్తున్నామని చెప్పుకొచ్చింది. క్రమ శిక్షణ లేని బ్రతుకులతో.ఒంటి నిండా రోగాలతో నిండి యున్న మనుషులకు మాతో పొలికేమిటి? మాకు ఆరోజు కడుపు నిండితే చాలు, ఇక ఆశపడం. కానీ మనిషి 1000 సంవత్సరాలు తినినంతా కూడబెట్టుకున్నా ఆశ చావదు. ఆ ఆశతోనే జీవితమంతా దుర్భరం చేసుకు బ్రతుకుతాడు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. దానితో ఒళ్ళంతా బిపి,షుగర్లతో ఏడుస్తాడు. అటువంటి అత్యాశ కలిగిన మనుషులతో మాకు పొలికేమిటి? ఇది మా జాతికే అవమానం! దీనిపై సరైన చర్య తీసుకోనంత వరకూ మేము ఊరుకుండే ప్రశ్నే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఏమి జరుగుతుందో, ఏమో ఎదురు చూడాలి.

1 కామెంట్‌:

  1. గుడ్ పోస్ట్ చౌదరిగారు. వాస్తవాన్ని చాలా చక్కగా వివరించారు.పులులతో కంపేర్ చేసుకునేవారికి గొప్పగా బుద్ధి చెప్పేరు.

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts